ఈసారి ఎన్నికల్లోనైనా కనీసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లిల్లోకి అడుగెట్టాలని ఈ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. మునుగోడు అసెంబ్లి ఉపఎన్నికల్లో వామపక్షాలు బేషరతుగా టీఆర్ఎస్కు మద్దతిచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలుపునకు వామపక్షాల మద్దతు కూడా ఓ కారణమంటూ బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో తెలంగాణాలో బీఆర్ఎస్తో పొత్తుంటుందని, తద్వారా తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశింప వచ్చని వామపక్షాలు ఆశించాయి.
అయితే, ఆ తర్వాత కేసీఆర్ పొత్తు విషయం ప్రస్తావించడం లేదు. చెరో రెండు సీట్లు మాత్రమే కోరుకొంటున్నా, వామపక్షాలు కీలక సీట్లపై కన్నేయడంతో వాటికిస్తే ఓటమిని ఆహ్వానించడమే అనే భావన బిఆర్ఎస్ నేతలలో వ్యక్తం అవుతుంది. మరోవంక, ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి సదస్సులో వామపక్షాలు కూడా పాల్గొనడంతో కాంగ్రెస్ తో పొత్తు సాధ్యమవుతుందని అంచనా ఇప్పుడు వేసుకొంటున్నాయి.
తెలంగాణాలో బిఆర్ఎస్ తిరోగమనంలో ఉందని, ఆ పార్టీతో పొత్తు రాజకీయంగా కలిసిరాదని నిర్ధారణకు వచ్చిన్నట్లు స్పష్టం అవుతుంది. బీజేపీని నిలువరించడంలో బీఆర్ఎస్ వెనుకబడిందని, పొత్తులకు తమకు కొత్త ఆప్షన్ దొరికిందని, బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్ పార్టీతోనైనా జట్టు కట్టడానికి సిద్ధమని, తెలంగాణలో బీఆర్ఎస్తో అధికారానికి పోటీపడే ప్రధాన పక్షం కాంగ్రెసేనని రెండు వారాల క్రితం చెప్పడం ద్వారా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తమ ఉద్దేశం ఇప్పటికే స్పష్టం చేశారు.
ఏదేమైనా, బిఆర్ఎస్, కాంగ్రెస్ – రెండు పార్టీలతో బేరాలాడి, ఎవ్వరు ఎక్కువ సీట్లు ఇస్తే వారితో వామపక్షాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా తెలంగాణాలో ఒకటో, రెండో సీట్లు గెలుచుకునే అవకాశాలు వారికి కనిపిస్తున్నా, ఏపీలో ఉనికిలో లేని ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. టిడిపితో పొత్తుకు బిజెపి సిద్దంకానీ పక్షంలో టిడిపితో పొత్తు పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల