`ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీగా కంగనా

మణికర్ణిక, తలైవి, ధడక్ వంటి మహిళా ప్రాధాన్యత, బయోపిక్ చిత్రాలలో ఈ మధ్య ఎక్కువగా నటిస్తున్న బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌
ప్రస్తుతం ఇదే తరహాలో ఎమర్జెన్సీ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇప్పటికే లీకైన ఈమె లుక్స్‌కు సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది.
 
ఈ సినిమాను కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ టీజర్‌ను రిలీజ్‌ చేసింది. తాజాగా విడుదలైన టీజర్‌ మంచి ఆసక్తిని కలిగిస్తుంది. సినిమాలో 1975వ నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు టీజర్‌తో స్పష్టమైంది.

ఇక కంగనా రనౌత్‌ ట్విట్టర్‌లో ‘‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న ఎమర్జెన్సీ విడుదల కానుంది’’ అంటూ నటి కంగనా రనౌత్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు నిర్మాత, దర్శకురాలు కూడా కంగనానే కావడం విశేషం. ప్రస్తుతం కంగనా చంద్రముఖి సీక్వెల్‌లో నటిస్తుంది. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టాకీ పార్టు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా గడుపుతుంది.