తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని ఇందులో ఏమాత్రం అనుమానం లేదని కేంద్ర సహకార శాఖ మంత్రి బిఎల్.వర్మ ధీమా వ్యక్తం చేశారు. జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం ఖమ్మం రూరల్ మండంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మారేమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఖమ్మం నగరంలో ఇటీవల రెండో షాదిఖానా కోసం శంకుస్దాపన చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. తర్వాత సమావేశంలో మాటాడుతూ గతంలో గోశాలకు కేటాయించిన సీక్వెల్ సమీపంలోని స్థలాన్ని ప్రస్తుతం రెండో షాదీఖానాకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత షాదిఖానకు కేటాయించిన స్ధలాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ళ బిజెపి పాలనలో దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పధఖాలను తీసుకొచ్చామని తెలిపారు. పిఎం అవాస్ యోజన పథకం ద్వారా దేశంలో నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు.

అయితే, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని డబుల్ బెడ్ రూం పథకంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. దేశంలో 48 కోట్ల జనధన్ ఖాతాల్లో బటన్ నొక్కగానే పేదలందరికి కేంద్ర సాయం జమ అవుతుందని పేర్కొన్నారు. ఉజ్వల యోజన ద్వారా 9.6 కోట్ల గ్యాస్ కనేక్షన్లను అందించామని తెలిపారు.

భారత్ అయిష్మాన్ పధకం ద్వారారూ.5లక్షల విలువైన వైద్యసాయం ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. కిసాన్ సన్మాన్ నినధి ద్వారా 11.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.  2.42 కోట్ల నిధులు జమ అయ్యాయని ఆయన చెప్పారు. దళారులు, పైరవీకారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని స్పష్టం చేయసారు.

ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు విస్తరించామని, ఖమ్మం జిల్లాలో రూ. 10,000  కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. 9 ఏళ్లలో 3 లక్షల 75వేల కి.మీ ఫోర్ లైన్ రోడ్లను నిర్మించామని పేర్కొన్నారు. 250 కీ మీ వరకు మెట్రో సేవలను విస్తరించామని ఆయన తెలపారు.

దేశంలో గడిచిన 9 ఏళ్ళ 390 మెడికల్ కళాశాలలను ప్రారంభించామని  బి ఎల్ వర్మ తెలిపారు. ప్రసాద్ పధకం ద్వారా దేవాలయాలను అధునీకరిస్తున్నామని పేర్కొన్నారు.  రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు గల్లా సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.