లండన్ లో హైదరాబాద్ కు చెందిన యువతి దారుణ హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి(27) మూడు సంవత్సరాల క్రితం లండన్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లింది. రెండు నెలల క్రితమే ఆ కోర్సు పూర్తి చేసుకుంది.
గత నెల ఆమె స్వదేశానికి రావాల్సి ఉంది. కొన్ని కారణాల దృష్ట్యా ఆమె రాలేక పోయింది.
ఈ నెల చివరి వారంలో వచ్చేందుకు సిద్ధం అయింది. లండన్లో తన మిత్రులతో కలిసి ఓ ఫ్లాట్లో నివసిస్తోంది తేజస్విని. అందులో అమ్మాయిలు, అబ్బాయిలూ కలిసి ఉంటున్నారు. తన ఫ్లాట్మేట్స్లో బ్రెజిల్కు చెందిన ఓ యువకుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లూ వీళ్లంతా కలిసి హాయిగా, జాలీగా గడిపారు.
అకస్మాత్తుగా ఏమైందో ఏమో తేజస్వినిపై బ్రెజిల్ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని మృతి చెందింది. అతడిని అడ్డుకోబోయిన తేజస్విని స్నేహితురాలైన మరో తెలుగమ్మాయి అఖిలపై కూడా దాడికి తెగబడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని బ్రెజిల్ యువకుడిని అరెస్టు చేశారు.
తేజస్విని చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో 15 రోజుల్లో భారత్ కు వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని, ఇంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతుందని ఊహించలేదని గుండెలవిసేలో రోదిస్తున్నారు. తేజస్వినికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామని తెలిపారు. తమ కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాడు తేజస్విని తల్లిదండ్రులు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ