యాత్రకు దారి తీసే రెండు మార్గాల్లో 120కి పైగా లంగర్లను (సామాజిక వర్గాలకు చెందిన భోజనశాలలు) ఈ ఏడాది నెలకొల్పినట్టు ఎస్ఏఎస్బీ అధికారులు తెలిపారు. యాత్రికుల ఆరోగ్యం దృష్ట్యా అనుమతించిన, నిషేధించిన ఆహార పదార్థాల జాబితాను ఎస్ఏఎస్బీ విడుదల చేసింది. జాబితాకు లోబడి పైన పేర్కొన్న 120 లంగర్లలో యాత్రికులకు ఆహార పదార్థాలను లంగర్ల నిర్వాహకులు అందించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
నిషేధిత ఆహార పదార్థాలు, పానీయాల జాబితాలో పూరి, బతూరా, పిజ్జా, బర్గర్, పరోటా, దోశ, వేయించిన రోటీ, బ్రెడ్, వెన్న, క్రీమ్తో కూడి పదార్థాలు, పచ్చళ్ళు, చట్నీలు, వేయించిన అప్పడాలు, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కారా హల్వా, జిలేబీ, గులాబ్ జామ్, లడ్డు, ఖోయా బర్ఫీ, రసగుల్లా, హల్వాతో కూడిన తినుబండారాలు, చిప్స్, కుర్కురే, మిక్సర్, పకోడా, సమోసా, నాన్ వెజ్ పదార్థాలు ఉన్నాయి. వీటితో పాటుగా లిక్కర్, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లుపై నిషేధం విధించినట్టు అధికారులు తెలిపారు.
More Stories
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు