ఎంఎల్ఎ రసమయికి దళితుల నిరసన సెగ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరంలో చెరువుల పండుగ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యేయ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దళితులు ఎమ్మెల్యేకు తమ గోడును చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు ససేమిరా అనడంతో ఒక్కసారిగా దళిత మహిళలు, యువకులు గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్‌కి అడ్డంగా రోడ్డుపై బైఠయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో నిరసనకారులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనుచరులు  నిరసనలు తెలపకుండా దళితులను అడ్డుకుని తోసేశారు.  ఈ పరిణామాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన యువకులపై ఓ మండల ప్రజా ప్రతినిధి మాట జారడంతో ఆందోళన నెలకొంది. వెంటనే పోలీసులు యువకులను, మహిళలను పక్కకు నెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ఎంపిపి ఉట్కూరి వెంకట రమణారెడ్డి దళితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన 20మంది దళితులకు డబుల్ బెడ్ రూం ల కింద రూ.5లక్షల 40వేలు ఇప్పిస్తామని, ఒక్కోక్కరి దగ్గర రూ.10వేలు వసూలు చేశారని వాపోయారు. మొత్తం రూ.2లక్షలు వసూలు చేసి ఏడాదిన్నర క్రితం ఇచ్చామని, అప్పటి నుండి ఉన్న ఇంటిని కూల్చీవేసుకుని పూరి గుడిసేలలో కాలం వెల్లదిస్తున్నామని వివరించారు.

మేం భాదను చెప్పుకుందామని వస్తే మాపై ఇలా ఎదురు దాడి చేయడం సరైంది కాదని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఎంపిపి హామి ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రసమయి సానుకులంగా స్పందినట్లు ఆయన తెలిపారు.