అమెరికాలో 9/11 దాడిని పక్కాగా అంచనా వేసిన బాబా వంగా 2023లో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని, ఈ ఏడాది చివర్లో అణుదాడి జరుగుతుందని, అది భూమిపై భయంకరమైన విధ్వంసం సృష్టిస్తుందని ఆమె తనమరణానికి ముందే చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. భవిష్యత్ గురించి ఖచ్చింతంగా చెప్పే బాబా వంగా 1996లో కన్ను మూశారు.
అయితే ఆమె భవిష్యత్ సంవత్సరాలలో ఆమె వెల్లడించిన జరగబోయే విషయాలు ఇప్పటి వరకు అన్ని నిజయయ్యాయి. తాజాగా బాబా వంగా ప్రకారం, 2023లో ఒక పెద్ద అణు విద్యుత్ ప్లాంట్లో పేలుడు సంభవిస్తుంది. ఇది ఆసియా అంతటా విషపూరిత మేఘాలను వ్యాపింపజేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తీవ్రమైన వ్యాధులు ఉంటాయి, ఎందుకంటే అణు విస్ఫోటనం కారణంగా, భయంకరమైన రేడియేషన్ బయటకు వస్తుంది, చుట్టూ వినాశనం ఉంటుంది. అంతేకాకుండా ఒక పెద్ద ఖగోళ సంఘటన జరుగుతుంది. భూమి యొక్క కక్ష్యలో మార్పు ఉంటుంది.
దీనివల్ల భూమిపై తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే భయంకరమైన భూకంపాలు లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని విచిత్రమైన ఆవిష్కరణలు జరుగుతాయి.. వాటివల్ల ల్యాబ్లో పిల్లలు పుట్టి వారి రంగు, లింగాన్ని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో దాడి చేస్తుందని దీని వల్ల వేలాది మంది చనిపోతారని బాబా వంగా అంచనా వేశారు.బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం బల్గేరియాకు చెందిన ఈ అంధురాలు 1996లో మరణించింది. అయితే ఇప్పటి వరకు ఆమె చెప్పిన అంచనాలన్నీ దాదాపు నిజమయ్యాయని చెబుతున్నారు. 2023కి సంబంధించి ఆమె చెప్పిన అనేక అంచనాలు సరైనవని రుజువు చేస్తున్నాయి. 2023 సహజంగానే గొప్ప తిరుగుబాటు సంవత్సరం అవుతుందని ఆమె పేర్కొన్నారు.
చాలా శక్తివంతమైన భూకంపాలు వస్తాయి. అకాల వర్షాలు కురుస్తాయి. ఎడారిలో వరద వంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సౌర తుఫాను కూడా ఉంటదని అంచనా వేసింది. అన్నీ సరైనవని రుజువు అయ్యాయి కూడా. ఇటీవల, శాస్త్రవేత్తలు సూర్యునిలో భూమి కంటే 20 రెట్లు పెద్ద రంధ్రం కనుగొన్నారు. దాని నుండి వెలువడే రేడియేషన్ ప్రభావం లడఖ్ వరకు కనిపించింది. దీనిని సౌర సునామీగా పరిగణించారు.
బాబా వంగా కూడా అనేక శక్తివంతమైన భూకంపాలను అంచనా వేశారు. ఈ సంవత్సరం టర్కీ , సిరియాలో భూకంపం భయంకరమైన వినాశనాన్ని కలిగించడం మీరు చూశారు. ఇందులో 50వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నేటికీ అక్కడ పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, అమెరికాలో తీవ్రవాద సంస్థ అల్ ఖైదా 9/11 దాడులు , ఐఎస్ఐఎస్ పుట్టుకతో సహా బాబా వంగా చాలా అంచనాలు వేశారు. ఇవి నిజమయ్యాయి. ఇప్పుడు ఆమె ఈ సంవత్సరం చివరి నాటికి భయంకరమైన అణు విస్ఫోటనం గురించి మాట్లాడారు. అందుకే ప్రపంచం భయపడుతోంది. ఇది నిజమయితే ప్రపంచ వినాశం అవుతుందని భావిస్తున్నారు.
More Stories
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!
ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్
అల్లర్ల నిందితుల అరెస్ట్కు ప్రత్యేక బృందాలు