2022-23లో మొత్తం యూపిఐ చెల్లింపుల్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు 75 శాతంగా ఉన్నాయి. భారత డిజిటల్ మార్కెట్ 50 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నది. 2022-23లో 103 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇవి 2026-27 నాటికి 411 బిలియన్ లావాదేవీలకు పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.
2026-27 నాటికి రోజుకు 1 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. 2022-23లో 379బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయని, ఇవి 2026-27 నాటికి 83.71 బలియన్ల లావాదేవీలకు పెరిగుతాయని ఈ నివేదిక అంచనా వేసింది. యూపీఐ తరువాత ఎక్కువ లావాదేవీలు క్రెడిడ్, డెబిట్ కార్డు ద్వారా జరుగుతున్నాయి.
వచ్చే ఐదు సంవత్సరాల్లో క్రెడిట్ కార్డుల జారీ 21 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేసింది. ఇదేకాలంలో డెబిట్ కార్డుల వృద్ధి 3 శాతంగా ఉంటుందని తెలిపింది. డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి ప్రధానంగా వాటిని క్యాష్ విడ్డ్రా కోసం ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం ఎక్కువగా యూపీఐ ద్వారానే క్యాష్ విత్డ్రా జరుగుతుందని పేర్కొంది.
రానున్న ఐదు సంవత్సరాల్లో పేమెంట్ ఇండస్ట్రీ ఎక్కువగా ఎకోసిస్టమ్ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంబెడెడ్, ఎకోసిస్టమ్ ఫైనాన్స్ చెల్లింపుల లావాదేవీలు, ఆఫ్లైన్ చెల్లింపుల ఆధారంగా డిజిటల్ రుణాలు ఇవ్వడం వంటి రంగాలు చెల్లింపుల పరిశ్రమ తదుపరి దశ వృద్ధికి దారితీస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం కార్డుల ఆదాయంలో క్రెడిట్ కార్డుల అదాయం 76 శాతం వుంటుందని పిడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది.
2022-23లో బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు, ఫిన్టెక్ సంస్థలకు క్రెడిట్ కార్డుల ఆదాయం లాభదాయకంగా ఉందని తెలిపింది. 2021-22తో పోల్చితే 2022-23లో క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే ఆదాయం 42 శాతం పెరిగింది. ఇది వచ్చే ఐదు సంవత్సరాల్లో 33 శాతం పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది.
More Stories
త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు
బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు