ఆధార్ కార్డులో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు వెలుసుబాటు కల్పించారు. ఆన్లైన్ ద్వారా మీరే మీ కార్డు వివరాలను రూపాయి చెల్లించకుండా నవీకరించుకోవచ్చు. ఆధార్ కార్డులో మీ వివరాలు తప్పుగా ఉంటే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
అందుకే వాటిని సరి చేసుకోవాలి. అలాగే ఆధార్ జారీ చేసి 10 ఏళ్లు గడిచినట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు గత కొద్ది రోజుల క్రితం యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఎలాంటి రుసుములు చెల్లించకుండా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది.
అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం పాటే ఉంటుందని, జూన్ 14, 2023 లోపు ఉచితంగా ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. myAadhaar పోర్టల్ ద్వారా మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ కోసం సమీపంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం రూ.50 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడం ఇలా:
- ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకునే వారు ముందుగా https://myaadhaar.uidai.gov.
in/ లోకి లాగిన్ అవ్వాలి. - ఆ తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి. దాంతో మీ రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
- స్క్రీన్పై కనిపించే వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలి.
- ఒకవేళ మీ వివరాలన్నీ సరిగ్గానే ఉంటే నెక్ట్స్ హైపర్ లింక్పై క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో మీ అడ్రస్, గుర్తింపు ప్రూఫ్లను అప్లోడ్ చేయాలి.
- అప్డేట్ చేసిన పీఓఏ, పీఓఐ పత్రాలు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తాయి.
More Stories
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు