ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణలపై దృష్టి సారించాలి

ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని, వినియోగదారితత్వంతో కాకుండా వర్ధమాన దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి నమూనాలను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జి-7 శిఖరాగ్ర సదస్సులో ‘బహుళ సంక్షోభాల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేద్దాం’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.

ఆహారం, ఆరోగ్యం, అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రపంచం ఎదుర్కొంటును సవాళ్ల పరిష్కారానికి మోదీ పది అంశాల కార్యాచరణను ప్రతిపాదించారు. ట్రాన్స్‌జెండర్ల వ్యక్తిగత హక్కులను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలనీు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సన్నకారు రైతులతో సహా నిస్సాహయక ప్రజలను రక్షించుకునేందుకు సమగ్ర ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

తృణధాన్యాల వినియోగానిు పెంపొందించాలని, దీనివల్ల పోషకాహర సవాళ్లను అధిగమించడమే కాకుండా పర్యావరణ ప్రయోజనాలూ చేకూరుతాయని ప్రధాని చెప్పారు. ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే ఆహార వృథాను అరికట్టాలి హితవు పలికారు. ప్రపంచ ఎరువుల సరఫరా వ్యవస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చేయాలని కోరారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్య రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, అధ్యాత్మిక, సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు. అదే సమయంలో డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందుబాటులోకి తీసుకురావాల్సిన అసరముందని స్పష్టం చేశారు. ఆరోగ్య రక్షణ నిపుణుల రాకపోకలకు అంతరాయాలు లేకుండా చూడాలని చెప్పారు.