అంతర్జాతీయ మార్కెట్లో ఏజెన్సీలోని ఆర్గానిక్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. దీంతో, గిరిజనులకు చెల్లించే ధర పెంచి కొనుగోలు చేసినా, జిసిసి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. గత ఏడాది పార్చుమెంట్ కాఫీ కిలోకు రూ.285, చెర్రీ కాఫీ కిలోకు రూ.145 చొప్పున చెల్లించింది.
రూ.20 కోట్ల టర్నోవర్తో సాధించిన కోటిన్నర లాభంలో రూ.50 లక్షలు వరకు సిఎస్ఆర్ కింద కాఫీ గింజలు ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్లను గిరిజనులకు అందజేయాలని ఆలోచిస్తోంది. కాఫీ ప్రాసెసింగ్కు పెడుతున్న ఖర్చును తగ్గించుకొనేందుకు డౌనూరులో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పెట్టేందుకు జిసిసి ప్రయత్నిస్తోంది.
ప్రాసెసింగ్, రోస్టింగ్, గ్రైండిగ్ చేయడం ద్వారా ప్రాసెసింగ్ ఖర్చు తగ్గించుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది. కాఫీకి మార్కెట్లో మంచి ధర, మరింత నాణ్యమైన కాఫీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. యూనిట్ ఇక్కడ ప్రారంభిస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. బెంగళూరులో ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఖర్చు తగ్గించుకోవాలని, కాఫీ పండిస్తున్న గిరిజనులకు లాభాలను వివిధ రూపాల్లో ఇవ్వాలని జిసిసి యోచిస్తోంది. ఎరువులు ఉపయోగించకుండా పండిస్తున్న కాఫీకి జిసిసి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తోంది.
ఇప్పటివరకు చింతపల్లి మండలంలోని 2,210 ఎకరాలు, జికె.వీధి మండలంలోని 3,435 ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్న 1300 మంది రైతులకు చొప్పున ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చింది. డౌనూరులో ఐదెకరాల స్థలంలో నాలుగు కోట్ల విలువైన కాఫీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ను వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తామని జిసిసి ఎమ్డి జి.సురేష్ కుమార్ తెలిపారు.
More Stories
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు
నామినేషన్లకు గడువు ముగింపు… పోటీలో అభ్యర్థులు ఖరారు
మూడు పార్టీల మేనిఫెస్టో విడుదల రేపే