నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బుధవారం సుమారు వంద ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. నిషేధిత వేర్పాటువాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సభ్యుడు జస్విందర్ సింగ్ ముల్తానీకి లింకు ఉన్న ప్రదేశాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
చండీఘడ్లో గత ఏడాది మోడల్ బురెయిల్ జైలు వద్ద బాంబు పెట్టిన కేసులో జస్విందర్ సింగ్ ముల్తానీ అనుమానితుడు. లుథియానా కోర్టు పేలుడు ఘటనలో మాస్టర్మైండ్ అయిన అతన్ని 2021లో జర్మనీలో అరెస్టు చేశారు. టెర్రర్, నార్కోటిక్స్, స్మగ్లింగ్, గ్యాంగ్స్టర్ కేసుల్లో భాగంగా ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్స్టర్లు.. ఖలిస్తానీ గ్రూపులకు ఫండింగ్ చేస్తూ ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఎన్ఐఏకు చెందిన సుమారు 200 రెడ్ టీమ్ సభ్యులు సోదాల్లో పాల్గొంటున్నారు. ఎస్ఎఫ్జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుకు సన్నిహితుడి జస్విందర్. రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ను సింగూ బోర్డర్ వద్ద చంపాలని జస్విందర్ ప్లాన్ చేశాడు.
దేశంలో ఉగ్రవాద చర్యలను ప్లాన్ చేయడంలో , అమలు చేయడంలో ఖలిస్తానీ గ్రూపులతో సంబంధాలున్న గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉందని ఇంటెలిజెన్స్ ఇన్పుట్లకు ప్రతిస్పందనగా ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తోంది. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే క్రిమినల్ నెట్వర్క్లను కూల్చివేయడానికి ఎన్ఐఏ చేస్తోన్న ప్రయత్నాలలో ఈ ఆపరేషన్ ఒక కీలకమైందిగా తెలుస్తోంది.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు