పూర్తిగా ఫలితాలు వెల్లడైన తరువాత పూర్తి స్థాయిలో ఆత్మ విమర్శ చేసుకుంటామని చెప్పారు. ఫలితాలపై సంపూర్థ విశ్లేషణ చేసి, తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు. ‘‘ఒక జాతీయ పార్టీగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈ ఎన్నికల్లో గెలుపు, ఓటములకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష జరుపుతాం. వివిధ స్థాయిల్లో ఏయే విషయాల్లో దెబ్బతిన్నామనే విషయాన్ని విశ్లేషిస్తాం’’ అని వివరించారు.
ఈ ఎన్నికల ఫలితాలను పార్టీ అంగీకరిస్తోంది. పొరపాట్లను, తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుని రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతామని బొమ్మై స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీలోని లోటుపాట్లను సరిదిద్ధి, పార్టీని మళ్లీ రీ ఆర్గనైజ్ చేసి, రానున్న లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక గుణపాఠంగా స్వీకరిస్తామని చెప్పారు.
గెలుపు, ఓటములు బిజెపికి కొత్త కాదు

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం