బుద్ధం శరణం గచ్ఛామి ఎగ్జిబిషన్ ని కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్లో ప్రారంభించారు. సీనియర్ బౌద్ధ సన్యాసులు, రాయబారులు, దౌత్యవేత్తలు, మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ ఎగ్జిబిషన్ను మీనాక్ష లేఖి ప్రారంభించారు.
డ్రెపుంగ్ గోమాంగ్కు చెందిన కుండెలింగ్ తత్సక్ రింపోచే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. బుద్ధ పూర్ణిమ తర్వాత వారంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ బుద్ధ భగవానుడి జీవితం ఆధారంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ కళ, సాంస్కృతిక ప్రయాణాన్ని ప్రదర్శించింది.
పలు విభాగాలుగా విభజించిన ఆధునిక భారతీయ కళ దిగ్గజ కళాఖండాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కటి బౌద్ధమతం .. బుద్ధుని జీవితంలోని విభిన్న కోణాన్ని ప్రదర్శించింది. ప్రదర్శనలో ఉంచిన ఈ కళాత్మక రచనలు బౌద్ధమతం చరిత్ర, తత్వశాస్త్రంలో ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి. సీనియర్ బౌద్ధ భిక్షువుల మంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన, అంగవస్త్ర సమర్పణతో ఈ ప్రదర్శన ప్రారంభమైంది.
మీనాక్షి లేఖి మాట్లాడుతూ బుద్ధుని బోధనలు 2500 సంవత్సరాల క్రితంవి అయినా నేటికీ చాలా సందర్భోచితంగా ఉన్నాయని పేర్కొన్నారు. సిద్ధార్థ గౌతముడు లుంబినీలో జన్మించినప్పటికీ, అతనికి జ్ఞానోదయం బోధ్ గయలో అయిందని ఆమె గుర్తు చేశారు. నేపాల్, భారత్లలోని ఈ రెండు ప్రదేశాలు ఈ రోజు రెండు దేశాలను గట్టిగా బంధించాయని ఆమె చెప్పారు.
భారతదేశం బౌద్ధ తత్వశాస్త్రానికి మాత్రమే కాకుండా కళ, సంస్కృతికి కూడా కేంద్రంగా ఉందని చెబుతూ అందువల్ల బౌద్ధమతం విలువలను ప్రపంచానికి అందించడం భారతదేశం బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఇది భారతదేశ భావజాలం స్వచ్ఛత, భౌతికవాదం, విలువ వ్యవస్థలతో పాటు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అని ఆమె పేర్కొన్నారు.
గణనీయమైన బౌద్ద జనాభాను కలిగి ఉన్న నేపాల్, మయన్మార్, మంగోలియా, దక్షిణ కొరియా, థాయిలాండ్, భూటాన్ మొదలైన దేశాలు ఈ ప్రదర్శనకు హాజరయ్యాయి. ఈ ప్రదర్శనలో డెన్మార్క్, గ్రీస్, లక్సెంబర్గ్, జమైకా, పోర్చుగల్, జార్జియా, ఐస్లాండ్, ఈక్వెడార్, సిరియా, పెరూ వంటి దేశాల నుండి రాయబారులు, అనేక ఇతర దేశాల నుండి సీనియర్ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో శ్రీలంక, మయన్మార్ వంటి దేశాల నుంచి పెయింటింగ్లను ప్రదర్శించారు.
More Stories
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
జూన్ 4 తర్వాత కూటమి విచ్ఛిన్నం ఖాయం