కశ్మీరు జోన్ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ఇష్ఫాక్ అహ్మద్ వనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను వెల్లడించిన వివరాల ఆధారంగా దాదాపు 5 కేజీల నుంచి 6 కేజీల వరకు బరువుగల ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి పుల్వామా జిల్లాలోని అరిగమ్లో నివసిస్తున్నాడు. ఇతనిపై పుల్వామా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రాజౌరీలోని కంది అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఉగ్రవాద దాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులను శనివారం ఉదయం సైన్యం గుర్తించింది. ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. మరో ఉగ్రవాది గాయపడి, పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
మూడు రోజుల నుంచి కంది అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నాయి. అయితే ఉగ్రవాదులెవరూ కనిపించలేదని సైన్యం తెలిపింది. శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసినప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం రాజౌరీలోని 25 ఇన్ఫాంట్రీ డివిజన్ను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం సన్నద్ధతను పరిశీలించారు. అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యసాహసాలతో పని చేస్తున్నందుకు సైన్యాన్ని ప్రశంసించారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా