వారంలో బ్యాంకుల సేవలు భవిష్యత్తులో ఐదు రోజులకు పరిమితం కానున్నాయి. బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘాల ఎప్పటి నుంచో ఈ దిశగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యూనియన్స్ మధ్య సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది.
ఈ విషయంలో ప్రైవేటు, కోపరేటివ్ బ్యాంకులను ఇంకా ఒప్పించాల్సి ఉంది. అప్పుడే వారంలో ఐదు రోజుల పని విధానం అమల్లోకి రానుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ దీనిపై చర్చలు ముగించాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు పంపించనున్నారు.
ఆర్ బీఐ, ప్రైవేటు బ్యాంకుల, కోపరేటివ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యాజమాన్యాలతోనూ చర్చలు అవసరమని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ప్రైవేటు బ్యాంకులు తెరిచి ఉంటే, అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేయడం వల్ల వాటి వ్యాపారం దెబ్బతినకుండా చూడాల్సి ఉందన్నారు.
More Stories
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు