నారద మహర్షి గురించి అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాస్తవానికి లోకహితం కాంక్షించే అసలైన పాత్రికేయుడు అని జాతీయ వార పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ చెప్పారు. 1826 లోనే కోల్ కతా లో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక ‘నారద మహర్షి’ ముఖచిత్రం తో ప్రచురితం అయ్యిందని ఆయన చెప్పారు.
సమాచార భారతి ఆధ్వర్యంలో “తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు” నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని జరిగిన పాత్రికేయులకు సన్మాన సత్కారాలు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ఆ తర్వాత నారద మహర్షి ని పత్రికా రంగ ఆద్యుని గా గుర్తించాల్సి ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనుమరుగు చేశారని చెప్పారు.
పాత్రికేయులు నారద సూత్రాలలోని 75,76,77 వ సూత్రాలను ఆదర్శంగా తీసుకొని సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తి ని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు. పాత్రికేయులు సమాచారాన్ని అందించేటప్పుడు, వార్తలు రిపోర్ట్ చేసేటప్పుడు లోకహితం దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సుతో అందించే వార్తలే నాణ్యతతో నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
సమాచార భారతి అధ్యక్షులు డా. జి గోపాలరెడ్డి అధ్యక్షత వహిస్తూ జాతీయ భావ ఆలోచనా స్రవంతిని నిలబెట్టాల్సిన అవసరం గుర్తించి సమాచార భారతి ఆవిర్భావం జరిగిన్నట్లు తెలిపారు. యువ పాత్రికేయులకు విలువలతో కూడిన పాత్రికేయతపై తర్ఫీదు ఇవ్వటం, సామాజిక మాధ్యమం లో పనిచేస్తున్న పౌర పాత్రికేయుల సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమాచారభారతి నిర్వహిస్తోందని వివరించారు.
“వడ్లమూడి స్మారక పురస్కారం”ను సీనియర్ పాత్రికేయులు, స్వతంత్ర టీవీ అవుట్ పుట్ ఎడిటర్ రమా విశ్వనాథన్ కి,’ భండారు సదాశివ రావు స్మారక’ పురస్కారం సీనియర్ పాత్రికేయులు సామవేదం జానకీరామ్ కి, ‘ సమాచార భారతి కాలమిస్ట్’ పురస్కారం శ్యామసుందర్ వర యోగి కి, ‘సమాచారభారతి యువపురస్కారం’ యువ పాత్రికేయులు కొంటు మల్లేశంకి అందించారు. కార్యదర్శి ఆయుష్ నడింపల్లి కూడా పాల్గొన్నారు.
More Stories
బిజెపి రేజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు
బీజేపీతోనే గిరిజన, దళితులకు గౌరవం
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు