రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ విషయంలో తమను సంప్రదించకుండా మరోసారి రోడ్డెక్కి ఆందోళన చేయడం సరికాదని హితవు చెప్పారు. ఇలా రోడెక్కిన రెజ్లర్లు క్రమశిక్షణ తప్పారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘లైంగిక ఆరోపణల ఫిర్యాదుల కోసం ఐఓఏలో ఓ కమిటీ, అథ్లెట్ల కమిషన్ ఉంది. రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కే బదులు మమ్మల్ని సంప్రదిస్తే బాగుండేది. ఈ విషయంలో రెజ్లర్లు కొంచెం క్రమశిక్షణ చూపెట్టాల్సింది. కానీ, వాళ్లు ఐఓఏ వద్దకు రాకుండా నేరుగా రోడ్డెక్కారు. ఇది ఆటకు మంచిది కాదు’ అని గురువారం ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఉష స్పష్టం చేశారు.
రెజ్లర్లు ధర్నాలో కూర్చోవడమే కాకుండా రాజకీయ పార్టీల నాయకులనూ ఆహ్వానించడం తనను నిరుత్సాహానికి గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. కమిటీ రిపోర్ట్ వచ్చే వరకైనా వారు వేచి ఉండాల్సిందని చెబుతూ ‘వారు చేసిన పని క్రీడకు, దేశానికి మంచిది కాదు. ఇది ప్రతికూల విధానం’ అని ఆమె విమర్శించారు ఇక రెజ్లర్ల తీరుతో దేశ ప్రతిష్ఠ దిగజారేలా ఉందని ఉందని ఐఓఏ జాయింట్ సెక్రటరీ, తాత్కాలిక సీఈవో కల్యాణ్ చౌబే మండిపడ్డారు.
అయితే, పీటీ ఉష కామెంట్లు తనను షాక్ కు గురి చేశాయని స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా చెప్పాడు. ఆమె నుంచి ఇంత కఠినమైన స్పందనను ఊహించలేదన్నాడు. ‘ఆమె స్వయంగా అథ్లెట్. పైగా మహిళ. తను మాకు సపోర్ట్ ఇస్తారని అనుకున్నాం.
మరోవైపు పీటీ ఉషా చేసిన ఈ వ్యాఖ్యలపై రెజ్లర్ బజరంగ్ పునియా ఐవోఏ అధ్యక్షురాలి నుంచి తాము మద్దతు ఆశించామని, అయితే ఇలాంటి కఠిన స్పందనను తాము అసలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా, బ్రిజ్భూషణ్పై కేసు నమోదు కోసం రెజ్లర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సీరియస్ అంశంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, ఢిల్లీ పోలీసులకు నోటీస్ జారీ చేయాలని గురువారం ఆదేశించింది.
మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి, ఎన్నికలను నిర్వహించడానికి ఐఓఏ ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని నియమించింది.
More Stories
44 శాతం పెరిగిన దళిత విద్యార్థుల అడ్మిషన్లు
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లలో కుప్పలుగా నల్లధనం
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు