వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్ షర్మిల కారును ఆపేందుకు యత్నిస్తుండగా, కానిస్టేబుల్ గిరిబాబుపై కారును ఎక్కించారు. దానితో కారు ఎక్కించడంతో గాయపడ్డ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్కు గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ”తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. నన్ను ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో చెప్పాలి. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్తున్నా.. అడ్డుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భయపడుతున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొందాలా. కెసిఆర్కు నిజాయితీ ఉంటే పేపర్ లీకేజ్పై సిబిఐ విచారణ జరిపించాలి” అని డిమాండ్ చేశారు.
ఇంకోవైపు, వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్కు వైఎస్ విజయమ్మ వెళ్లారు. షర్మిలను కలిసేందుకు విజయమ్మ పీఎస్ లోపలికి వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. తన కూతురిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.
వైఎస్ విజయమ్మను కారులో నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. దీంతో తన కూతురిని చూడటానికి ఎందుకు అనుమతించరంటూ పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. వాదిస్తున్న ఓ మహిళా అధికారిని కొట్టారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని విజయమ్మ తెలిపారు.
More Stories
పోలింగ్ ముందు నగదు బదిలీకి జగన్ కు ఈసీ మోకాలడ్డు
బీజేపీని గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో తెలంగాణ ప్రజలు
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుపై అరెస్ట్ వారెంట్