కబ్జాలకు పాల్పడకపోతే మంత్రి దగ్గరున్న ఆధారాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే నిలదీశారు. విదేశాల్లో ఉన్న వారు భూములు ఎలా కొనుగోలు చేశారని, ఆ సమాచారం ఆర్బీఐకు తెలియ చేశారా? అని ప్రశ్నించారు. కృష్ణా నది భూములు కబ్జాకు గురయ్యాయని తాను ఆరోపించానని, అవి నిజం కాకపోతే సర్వేకు ఎందుకు మంత్రి ముందుకు రావట్లేదని అడిగారు.
పహాణీలలో ఉన్న పత్రాలను తాను బయటపెట్టానని, తన దగ్గర ఉన్న పత్రాలు తప్పుడు పత్రాలైతే అసలు పత్రాలను మంత్రి బయట పెట్టాలని సవాలు చేశారు. రైతులు అడిగితే ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైందని చెబుతున్నారని, వాస్తవాలను చెప్పకుండా సంబంధం లేని విషయాలు మంత్రి మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.
ఎన్నారైలుగా ఉన్న వారు వ్యవసాయ భూములు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. మంత్రి కుమార్తెలు చిన్న వయసులోనే ఆస్ట్రేలియా వెళ్లిపోయారని, వారికి ఇక్కడ భూములు ఎలా వచ్చాయని నిలదీశారు. మంత్రి భూ కబ్జాల భాగోతంపై ఈడీ విచారణ కోసం ఆశ్రయిస్తానని, దర్యాప్తు తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.
గిరిజనుడిని అడ్డు పట్టుకొని మంత్రి పొందిన సబ్బీడీలు ఎన్ని అని రఘునందన్ ప్రశ్నించారు. ప్రజలను మంత్రి నిరంజన్ రెడ్డి మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు మంత్రి కొనుగోలు చూసిన భూముల లెక్కలు చూపించడం లేదంటనే మంత్రి తప్పు చేసినట్లు అని రఘునందన్ రావు ఆరోపించారు.
మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో ఓ గిరిజన బిడ్డను తన దత్తపుత్రుడిగా చెప్పుకున్నట్లు ఆరోపణలు వినిపించాయని చెబుతూ ఆ దత్తపుత్రుడి పేరుపై కాంట్రాక్ట్ పనులు చేయించారని ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కొన్న భూముల వివరాలు ఎందుకు రికార్డుల్లో చూపించలేదని ప్రశ్నించారు.
More Stories
డీకే అరుణ పార్లమెంట్లో అడుగుపెడుతారనే ప్రధాన విశ్వాసం
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావు
పోలింగ్ ముందు నగదు బదిలీకి జగన్ కు ఈసీ మోకాలడ్డు