బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న దేశాలతో సాంస్కృతిక, దౌత్య సంబంధాల బలోపేతం కోసం ‘గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ – 2023’ను ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. బౌద్ధమతం భారతదేశంలో పుట్టి వివిధ దేశాలను విస్తరించిందని, అలాంటి దేశాలతో మనకున్న సాంస్కృతిక సారూప్యతను కాపాడుకుంటూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ఆయన తెలిపారు.
భారతదేశం బౌద్ధమతానికి సంబంధించి తొలిసారి ఇంత పెద్ద ఉత్సవం నిర్వహిస్తోందని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బౌద్ధమతం చూపించే మార్గం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో 30 దేశాలనుంచి బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతాన్ని ఆచరించే ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, అంబాసిడర్లు తదితరులు పాల్గొంటారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్