ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దుమారం రేగింది. స్వర్ణాలయాన్ని ఖలిస్తానీలు చేజిక్కించుకున్నారా అన్న శీర్షికతో ఒక 40 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మొహానికి త్రివర్ణ పతాకాన్ని పెయింట్ వేసుకున్న ఒక మహిళ స్వర్ణాలయంలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్న సేవాదార్తో వాగ్వాదం పెట్టుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ఆమె మరో వ్యక్తికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా ఈ మహిళను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సేవాదార్ను ఆ వ్యక్తి ప్రశ్నించడం చూడవచ్చు. ఆమె తన మొహంపై త్రివర్ణ పతాకాన్ని టాటూ వేసుకోవడం పట్ల సేవాదార్ అభ్యంతరం తెలియచేయగా అప్పుడు ఆ వ్యక్తి ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించారు. ఇది పంజాబ్ అంటూ సేవాదార్ జవాబివ్వడం వీడియోలో చూడవచ్చు.
దీంతో ఆ మహిళ తన వాదన కొనసాగిస్తూ స్వర్ణాలయం భారత్లో లేదన్నట్లు ఆ సేవాదార్ మాట్లాడడం బక్వాస్(చెత్త) అంటూ మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(ఎస్జిపిసి) స్పందించింది. జనరల్ సెక్రటరీ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, బాలిక ముఖంపై వేసుకున్నది త్రివర్ణ పతాకం కాదని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఇది సిక్కుల మందిరం.. ప్రతీ మతంలోనూ ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయి. మేము అందరినీ ఆహ్వానిస్తాం. అధికారులు తప్పుగా ప్రవర్తిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నాం. బాలిక ముఖంపై ఉన్నది మన భారత జాతీయ పతాకం కాదు. దానిపై అశోక చక్రం లేదు. అది రాజకీయ పతాకం అయి ఉండవచ్చు’’ అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రెవాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
More Stories
ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్
నేటి నుండి పార్లమెంట్ భద్రత చేబడుతున్న సిఐఎస్ఎఫ్
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు