ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆ మేరకు బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు బ్లెండింగ్ కోసం బొగ్గును దిగుమతి చేసుకోవాలని దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సూచించింది.
మరోవైపు ఈ ఏడాది మార్చిలో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్ వినియోగంపై వర్షాల ప్రభావం పడింది. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చిలో విద్యుత్ వినియోగం 128.47 బిలియన్ యూనిట్లు (బీయూ) నుంచి 126.21 బిలియన్ యూనిట్లకు పడిపోయింది. అయితే 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు విద్యుత్ వినియోగం 1,377.43 బిలియన్ యూనిట్లు (బీయూ). 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 1,374.02 బిలియన్ యూనిట్ల (బీయూ) కంటే ఇది ఎక్కువ.
కాగా, ఈ ఏడాది మార్చిలో వర్షాలు లేకపోతే విద్యుత్ వినియోగం గత ఆర్థిక సంవత్సరం కంటే మరింతగా పెరిగేదని విద్యుత్ రంగ నిఫుణులు తెలిపారు. 2023-24లో విద్యుత్ వినియోగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. విద్యుత్ వినియోగం పెరుగడం వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్కు డిమాండ్ ఏర్పడుతుందని విద్యుత్ రంగ నిఫుణులు పేర్కొన్నారు.
More Stories
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు