వరంగల్ లో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. ఏప్రిల్ 11వ తేదీ ఈ పిటీషన్ పై కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ అవసరం లేదని, ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయ్యిందంటూ బండి సంజయ్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించింది కోర్టు.
దీంతో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ కొట్టివేసింది కోర్టు. కేసులో కుట్ర కోణం లేదని, కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని సంజయ్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ తోపాటు జైలుకు వెళ్లిన మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది హనుమకొండ కోర్టు.
కొన్ని షరతులు కింద ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ఆర్డర్ కాపీ రాగానే ముగ్గురు నిందితులు కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ ఉన్నారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. బండి సంజయ్ తోపాటు అరెస్ట్ అయిన మరో ముగ్గురిని కలుపుకుంటే మొత్తం నలుగురికి బెయిల్ మంజూరైంది. ఒకరు మైనర్ గా ఉన్నారు. ఆ బాలుడిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదు.
More Stories
ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి
తెలంగాణకు 4 రోజుల పాటు వర్ష సూచన
తెలంగాణ ప్రజల్లో బిజెపి పట్ల విశ్వాసం పెరిగింది