అదే సమయంలో 124 సీబీఐ విచారణల్లో 95 శాతానికిపైగా ప్రతిపక్ష పార్టీలకు చెందినవారేనంటూ ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఇది రాజకీయ పగ, పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు. ఇలాంటివి జరగకుండా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు.
ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ విచారణ ఉండకూడదని చెప్పగలమా? నాయకులను దూరంగా ఉంచగలరా? రాజకీయ నాయకుడు ప్రాథమికంగా పౌరుడని, పౌరులుగా మనమంతా ఒకే చట్టానికి లోబడి ఉంటామని కోర్టు పేర్కొంది. దీనికి సింఘ్వీ స్పందిస్తూ భారతదేశంలో పెండింగ్లో ఉన్న ఏ కేసును సైతం ఈ పిటిషన్ ప్రభావితం చేయకూడదని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోమని కూడా కోరడం లేదని చెప్పారు.
ఈ మేరకు కోర్టు సామాన్యులకు, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించలేమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రడూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అయితే, పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు సింఘ్వీ కోర్టును కోరగా.. అనుమతి ఇచ్చింది.
More Stories
నలుగురు ఐఎస్ ఉగ్రవాదులు అహ్మదాబాద్ లో పట్టివేత
జెల్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స
దక్షిణ భారతదేశం అంతటా ఏనుగుల గణన