ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘన్ విదేశాంగ కార్యాలయం దగ్గర ఆత్మహుతి దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనకంగా మారింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఏకంగా ఆరుగురు మరణించారు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో మూడు నెలల్లో రెండో ఆత్మాహుతి దాడి జరిగింది.
అంతే కాదు.. పలువురికి గాయాలు అయ్యాయి. మృత్యుల్లో ఒక చిన్నారి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉగ్ర దాడిలో గాయపడిన వారిలో 12 మంది పౌరులు, ముగ్గురు భద్రత సిబ్బంది ఉన్నారు. ఆఫ్ఘన్ విదేశాంగ కార్యాలయం సమీపంలోని ఒక వ్యాపార కేంద్రంలో సూసైడ్ ఎటాక్ జరిగింది. ఈ దాడిలో ఆరుగురు ఆఫ్ఘన్ పౌరులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని గుర్తించారు భద్రత దళాలు. ఆ వ్యక్తిని భద్రతా దళాలు పట్టుకునే లోపే తనను తాను పేల్చుకున్నాడు. కాగా, కాబూల్లోని ఇటలీకి చెందిన ప్రభుత్వేతర సంస్థకు చెందిన ఎమర్జెన్సీ ఆసుపత్రికి రెండు మృతదేహాలతోపాటు గాయపడిన 12 మందిని తరలించారు.
మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. మరోవైపు సూసైడ్ బ్లాస్ట్లో మరణించిన ఆరుగురూ పౌరులేనని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పేర్కొంది. అయితే ఐఎస్ఐఎస్ పనిగా తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వం అనుమానిస్తున్నది.
More Stories
వంతెన ప్రమాదంలో భారతీయుల చొరవకు బిడెన్ ప్రశంస
అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం
అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన