స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిగినట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఏరోస్పేస్ సంస్థ గత సంవత్సరం స్టార్టప్గా ఎదిగింది. ఈ ప్రయోగాన్ని విక్రమ్సారాబాయ్ రాకెట్ ప్రయోగ స్టేషన్ తిరువనంతపురంలో అగ్నికుల్ అగ్నిలెట్ ఇంజిన్ సంస్థ 3డి టెక్నాలజీ ప్రింట్తో ప్రయోగాన్ని ప్రయోగించింది.
ప్రధానంగా సారాబాయ్ రాకెట్ స్టేషన్ ప్రయోగాలు ఇస్రో సింగిల్విండో ఒప్పందంతో నడుస్తోంది. ప్రయోగానికి కావాల్సిన మొత్తం సహాయ సహకారాలు ఇస్రో సమకూర్చినట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రయోగ విజయం అనేది తమ ప్రయోగ ప్రయాణంలో మరచిపోలేని విజయంగా అగ్నికుల్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు.
ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ అగ్నిలెట్ ఇంజిన్ ప్రయోగం 2021లోనే విజయవంతంగా ప్రదర్శించిందని చెప్పారు. స్టార్టప్ కంపెనీగా ఎదుగుతున్న కంపెనీ విజయంలో త్రీడీ ఫైర్ ప్రింటెడ్ టెక్నాలజీ ప్రయోగం ప్రథమస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పూర్తిగా రూపొందించిన, తయారుచేసిన, అగ్నిలెట్ ఇంజిన్ 2021లో ట్రెల్స్ ఇటీవల సింగిల్పీీస్ 3డీ ప్రింటెడ్ రాకెట్ల రూపకల్పన, తయారీకి పేటెంట్ పొందింది.
ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో ఇటువంటి రాకెట్ ఇంజిన్లను పెద్ద ఎత్తున ముద్రించడానికి దేశంలోనే మొట్టమొదటి రాకెట్ సదుపాయం అయిన రాకెట్ ఫ్యాక్టరీ1ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. కొత్త అత్యాధునిక ప్రొడక్షన్ హౌస్లో ఒకే పైకప్పు కింద రాకెట్ ఇంజిన్ను ఎండ్ట్ఖుఎ్ఖండ్ తయారీకి ప్రపంచ స్థాయి యంత్రాలు ఉన్నాయి.
సహ వ్యవస్థాపకుడు కూ మొయిన్ ”ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ సరైన దిశలో పెరుగుతోంది. దేశంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడానికి, పరీక్షించడానికి అత్యాధునిక సాంకేతికతలను పొందుతున్నట్లు తెలిపారు. ఎస్ ఆర్ చక్రవర్తి స్థాపించిన అగ్నికుల్, స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి , సరసమైనదిగా చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఈ స్టార్టప్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో డిసెంబర్ 2020లో అంతరిక్ష పరిశోధనా సంస్థ నైపుణ్యం, దాని వ్యవస్థలను పరీక్షించే సౌకర్యాలను యాక్సెస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ స్పేస్టెక్ కంపెనీ అని తెలిపారు.
More Stories
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు
అరుణాచల్లో బీజేపీకి 5 అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవం