“వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నాము. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే ఇందుకు కారణం. ఆయన దోషిగా తేలిన రోజు.. అంటే 2023 మార్చ్ 23 నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు అమల్లోకి వస్తుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్టికల్ 102 (1)(ఈ) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాము,” అని లోక్సభ సెక్రటేరియట్ ప్రకటనలో పేర్కొంది.
ఈ విధంగా అనర్హత వేటుకు గురయ్యే వారు మరో 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరని చట్టాలు చెబుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్ గాంధీ. కోలార్లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
“దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?” అని ప్రశ్నించారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో 2019లో గుజరాత్లోని సూరత్ జిల్లా కోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది.
ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్లోని జిల్లా కోర్టు. రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 52 ఏళ్ల రాహుల్ గాంధీని ఐపిసి సెక్షన్లు 499, 500 కింద చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్.హెచ్. వర్మ దోషిగా తేల్చేశారు.
More Stories
పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!
ఎన్డీయేలో చేరమని పవార్, ఠాక్రేలకు మోదీ ఆహ్వానం
అర్వింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్