నియామక బోర్డు సెక్రెటరీ పీఏతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోన్న యువతి తరచూ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వస్తుండేదని సిసి కెమెరాల ద్వారా గుర్తించడంతో అనుమానించారు. ఈ క్రమంలోనే. ఆమె ప్రశ్నాపత్రం ఇవ్వాలని కోరగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సెక్రెటరీ పీఏతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. యువతి మాయలో పడి ప్రశ్నా పత్రాలను లీక్ చేశారా? లేక ఇందులో దళారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
పురపాలక శాఖ పరిధిలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, పశుసంవర్ధక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ – ఏ కింద 170 పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బీ కింద 15 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది.
టౌన్ ప్లానింగ్ పరీక్ష మార్చి 12న, వీఏఎస్ పరీక్ష మార్చి 15, 16లలో నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రశ్నా పత్రాల లీక్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది.
More Stories
బీజేపీని గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో తెలంగాణ ప్రజలు
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుపై అరెస్ట్ వారెంట్
ఎన్నికల వేళ హైదరాబాద్లో ఆంక్షలు