కాగా, 2019 నుంచి పాకిస్థాన్ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది. వాటి ద్వారా డ్రగ్స్, ఆయుధాలను అక్రమంగా భారత్ సరిహద్దు ప్రాంతాల్లోకి చేరవేస్తున్నది. అయితే పాకిస్థాన్ వైపు నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించే డ్రోన్లను చాలాసార్లు భద్రతా సిబ్బంది కూల్చివేశారు. కూలిన డ్రోన్ల నుంచి సాధారణంగా హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకునేవారు. అయితే కొన్ని సందర్భాల్లో పిస్టల్స్వంటి ఆయుధాలు కూడా కూలిన డ్రోన్ల వద్ద లభించేవి.
మరోవైపు పంజాబ్తోపాటు రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. గత ఏడాది 22 డ్రోన్లను కూల్చివేశారు. ఈ ఏడాది గత రెండు వారాల్లో ఎనిమిది డ్రోన్లను కూల్చారు. పాకిస్థాన్ నుంచి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరుగుతుండటంతో వాటిపై పత్యేకంగా నిఘా ఉంచారు. కాగా, కూల్చిన డ్రోన్లు చైనాలో తయారైనట్లుగా, వాటికి వినియోగించిన బ్యాటరీలు పాకిస్థాన్లోని కరాచీ కంపెనీలో తయారైనట్లుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.

More Stories
ఉగ్రవాద ఆరోపణలపై ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్
ఢిల్లీలో పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్య ముఠా గుట్టురట్టు
ఒడిశాలో 11 మంది, ఛత్తీస్గఢ్లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు