
భైంసాలో మార్చి 5న ఆర్ఎస్ఎస్ మార్చ్కి అనుమతినివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగర శారీరకోత్సవం పేరుతో ర్యాలీకి ఆర్ఎస్ఎస్ ప్రణాళిక చేసింది. ఇటీవల శివాజీ జయంతి నాడు చేద్దామనుకున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టులో అర్ఎస్ఎస్ పిటిషన్ వేసింది. మార్చి 5న ర్యాలీ చేసేందుకు పోలీసులు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన బైంసా పోలీసులు ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించినట్లు హైకోర్టుకు తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికను హైకోర్టుకు సమర్పించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది రెండు సంవత్సరాల క్రితం బైంసాలో జరిగిన మత ఘర్షణలు వలన ప్రాణ నష్టం జరిగిందని కోర్టుకు వివరించారు.
భైంసా అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతమని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు బలంగా వినిపించారు. టిప్పు సుల్తాన్ పుట్టినరోజు ర్యాలీకు సైతం పోలీసులు అనుమతి ఇచ్చిన భైంసా పోలీసులు, ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
బైంసా భారత దేశంలోనే ఉందని, వెలుపల ప్రాంతం కాదని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదనలు విన్న హైకోర్టు బైంసా ఆర్ఎస్ఎస్ మార్చ్కు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
More Stories
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం