ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు నేత అగ్రనేత ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధాని రాయపూర్కు 400 కి.మీ. దూరంలోని జగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ)కి చెందిన ఓ జట్టు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
బస్తర్ ఐజి సుందరరాజ్ కథనం ప్రకారం… సుక్మా జిల్లా జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వారికి కుందేడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరుగ్రూపుల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. మూడు గంటలసేపు భయానక వాతావరణం నెలకొంది.
ఈ కాల్పుల్లో ఎఎస్ఐ రామురామ్నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, కానిస్టేబుల్ వంజం భీమా మృతి చెందారు. ఈ ఘటనలో ఎనిమిది మావోయిస్టులు చనిపోయారని, వారిలో ఓ అగ్రనేత ఉన్నాడని, మావోయిస్టుల మృతదేహాలను వారి సహచరులు అడవిలోకి మోసుకుపోయారని ఐజి సుందరరాజ్ తెలిపారు.
తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అన్వేషిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కుందేడ్ అటవీ ప్రాంతంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోన్న భయానక వాతావరణం నెలకొంది. ఈనెల 20న రాజ్నంద్గావ్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఇద్దరు పోలీసులు చనిపోయారు.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు