ఈ ఏర్పాట్లకు సంబంధించి భద్రతా సమన్వయ కమిటీ సమావేశం ఇటీవల డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన జరిగింది. కాగా, ఈ సదస్సుకు ముందు దేశంలోని 56 నగరాల్లో 215 కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఆరు జీ-20 సమావేశాలు జరగనున్నాయి.
మొదటి సమావేశం జనవరి 28న పూర్తయింది. మార్చి 6, 7తో పాటు ఏప్రిల్ 26, 27,28, జూన్ 7, 8, 9, 15, 16, 17లలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతస్థాయి స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.
జీ-20 సమావేశాలకు హాజరయ్యే ఉన్నత స్థాయి ప్రతినిధులు హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని డీజీపీ ఆదేశించారు. ప్రధానంగా విమానాశ్రయం, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశ ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను భద్రతా కమిటీలో సభ్యులగా ఉన్నారు.
More Stories
బిజెపి రేజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు
బీజేపీతోనే గిరిజన, దళితులకు గౌరవం
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు