మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దేశంలో మూడు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ఎఐ)కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే 5జి సర్వీసులను ఉపయోగించుకునే అప్లికేషన్లను అభివృద్ధి చేయడం కోసం ఇంజనీరింగ్ కాలేజిల్లో 100 ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
‘మూడు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో కృత్రిమ మేధ కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటికన్నా ఎక్కువ విజ్ఞాన శాఖల్లో పరిశోధనలు నిర్వహించడంలో,అలాగే వ్యవసాయం, ఆరోగ్యం,సుస్థిర నగరాలకు చెందిన రంగాల్లో అత్యధునాతనమైన ప్లికేషన్లను అభివృద్ధి చేయడంతో పాటుగా పరిష్కరించదగిన సమస్యల పరిష్కారాలను కనుగొనడంతో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి’ అని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో తెలియజేశారు.
5జి సేవలను ఉపయోగించుకునే అప్లికేషన్లను అభివృద్ధి చేయడం కోసం వివిధ అథారిటీలు, రెగ్యులేటర్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థల తోడ్పాటుతో ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 100 ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్