పని చేస్తున్నమహిళలకు స్వాంతన కలిగిస్తున్న ప్రధాని పాలన సంస్కరణలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రవేశపెట్టిన పాలన సంస్కరణలు పని చేస్తున్నమహిళలకు స్వాంతన కలిగిస్తున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల మహిళా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలిగాయని చెప్పారు.

మహిళా సిబ్బంది కోసం సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ చర్యలను వివరిస్తూ కార్యక్రమాలు అమలు చేసేందుకు  నోడల్ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తున్నదని మంత్రి తెలిపారు.   కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల సంఖ్యను ఎక్కువ చేయడానికి, పనిచేస్తున్న మహిళలకు వృత్తి కుటుంబ వ్యవహారాలు సమానంగా చూసుకునే వీలు కల్పించేందుకు డిఓపిటి కృషి చేస్తున్నాదని పేర్కొన్నారు. 

మహిళా ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలకు ఉదాహరణ చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్) అని మంత్రి చెప్పారు. మహిళా ఉద్యోగులకు  730 రోజుల సీసీఎల్  మంజూరు చేయడంతో పాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. సీసీఎల్ లో ఉన్న ఉద్యోగిని సంబంధిత అధికారి నుంచి ముందుగా అనుమతి పొంది ముందుగానే  కార్యాలయాన్ని వదిలి వెళ్ళే వెసులుబాటు కల్పించామని గుర్తు చేశారు.

సీసీఎల్ లో ఉన్నవారు సంబంధిత అధికారి  నుంచి ముందస్తు అనుమతి పొంది  సెలవు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ) సౌకర్యం కూడా పొందవచ్చు,  సీసీఎల్ లో ఉన్న సిబ్బంది సంబంధిత అధీకృత  అధికారుల నుంచి అనుమతులు పొంది  విదేశీ ప్రయాణాలపై కూడా కొనసాగవచ్చు. అంతేకాకుండా,  నియమం 43-సి నిబంధనల ప్రకారం సీసీఎల్  పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి  ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని  సీసీఎల్  కనీస వ్యవధి  15 రోజుల నుంచి 5 రోజులకు ప్రభుత్వం తగ్గించింది అని మంత్రి వివరించారు.

వికలాంగ పిల్లల విషయంలో 22 సంవత్సరాల పరిమితిని తగ్గించమని మంత్రి తెలిపారు. అంగ వైకల్యం కలిగి ఉన్న మహిళా ఉద్యోగులకు 2022  జూలై 1 నుంచి నెలకు  పిల్లల సంరక్షణ కోసం రూ. 3,000 చొప్పున ప్రత్యేక భత్యం మంజూరు చేస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది డీఏ  50% పెంపుతో 25% పెరుగుతుంది.

లైంగిక వేధింపులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న బాధిత మహిళా ప్రభుత్వోద్యోగి 90 రోజుల వరకు  ప్రత్యేక సెలవు పొందే  సదుపాయం కల్పించామని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో మంజూరు చేసే ఈ 90 రోజుల ప్రత్యేక సెలవులు  బాధిత మహిళా ప్రభుత్వోద్యోగి సెలవు ఖాతా నుంచి మినహాయించరని స్పష్టం చేశారు. 

గర్భంలోనే శిశువు చనిపోవడం లేదా జన్మించిన వెంటనే బిడ్డ చనిపోవడం వల్ల  తల్లి జీవితంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని చెబుతూ  దీనిని గుర్తించిన ప్రభుత్వం శిశు మరణాల వల్ల మహిళలకు కలిగే మానసిక గాయాన్ని దృష్టిలో ఉంచుకుని  పుట్టిన వెంటనే / చనిపోయిన వెంటనే బిడ్డ మరణించిన సందర్భంలో మహిళా ఉద్యోగికి  60 మంది ప్రత్యేక ప్రసూతి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

కరోనా సమయంలో కూడా మహిళా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వివిధ కార్యాలయం మెమోల  ద్వారా  రోస్టర్ / తప్పనిసరి హాజరు విధానాల నుంచి మినహాయింపు ఇచ్చామని ,గర్భిణులకు ఇంటి నుంచి పనిచేసే సౌకర్యం కల్పించామని చెప్పారు.  

పింఛనులు, పెన్షనర్ల సంక్షేమ శాఖలో మహిళా-కేంద్రీకృత సంస్కరణలను వివరించిన  డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులను  ప్రస్తావించారు. దీని ప్రకారం విడాకుల కోసం  తల్లిదండ్రుల మరణం ముందు దరఖాస్తు చేసి తల్లిదండ్రుల మరణం తర్వాత  డిక్రీ జారీ అయిన సందర్భంలో సదరు మహిళ కుటుంబ పెన్షన్ పొందడానికి  అర్హత పొందుతుంది.