రైల్వే అధికారులతో సంజయ్, లక్ష్మణ్ భేటీ

ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 
 
వందే భారత్ రైలు ప్రారంభంతో పాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 19న మొత్తం రూ.2400 కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివ్రుద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారుల వివరించారు. 
 
ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను, చేపట్టాల్సిన ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు రైల్వే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం సంజయ్ తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన కార్యక్రమాలకు వివరించారు. 
 
తెలంగాణ ప్రయోజనాల విషయంలో సంకోచించకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద పీట వేస్తున్నారని, ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారులను నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుందని చెప్పారు. 
 
అట్లాగే రైల్వే లేన్, డబ్లింగ్, ఎంఎంటీఎస్, గేజ్ మార్పిడీ పనులను కేంద్రం పెద్ద ఎత్తున చేపట్టిందని పేర్కొంటూ అందులో భాగంగా ఈనెల 19న ప్రధాని  సికింద్రాబాద్-విశాఖపట్నం వరకు ‘వందేభారత్’ రైలును జెండా ఊప లాంఛనంగా ప్రారంభిస్తారని లక్ష్మణ్ తెలిపారు. దీనిద్వారా ప్రయాణీకులకు మూడున్నర గంటట సమయం ఆదా కానుందిని, ఈ నేపథ్యంలో రూ.2400 కోట్లతో వివిధ రైల్వే అభివ్రుద్ధి పనులను ప్రధాని ప్రారంభించబోతున్నారని వివరించారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునికించడంలో సుమారు రూ.700 కోట్లతో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అట్లాగే ఖాజీపేట ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. రూ.1231 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించనున్నారు.
 
ఇప్పటికీ ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాల నుండి పట్టణాలకు అనుసంధానిస్తున్నారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం  సంజయ్, లక్ష్మణ్ నేరుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.