కాబుల్ సైనిక ఎయిర్‌పోర్టులో పేలుడు..10మంది మృతి

కొత్త సంవత్సరం ప్రారంభమై ఒకరోజు గడవక ముందే కాబూల్‌లో మృత్యుఘంటికలు మోగాయి. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని మిలటరీ ఎయిర్‌పోర్టు చెక్‌పాయింటు వద్ద ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోగా మరో 8మంది గాయపడ్డారని తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పేలుడుకు తామే ఏ హూగ్రసంస్థప్రకటించలేదు.

అయితే ఇస్లామిక్ స్టేట్‌గా గుర్తింపు పొందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ఐసిస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు. తాలిబన్లు 2021లో అధికారం చేపట్టిన తరువాత ఐసిస్ దాడులను ఉద్ధృతం చేసింది.

తాలిబన్ సైనికులును, మైనార్టీ షియా వర్గాన్ని లక్షంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడుతోంది. పేలుడు సంభవించిని ఎయిర్‌పోర్టు పౌర విమానాశ్రయానికి 200మీటర్ల దూరంలో ఉంది. గత అక్టోబర్‌లో ఆత్మాహుతి పేలుడు కారణంగా నలుగురు చనిపోవడంతో తాలిబన్ అంతర్గత మంత్రిత్వశాఖ మూసివేసింది. బాంబును స్థానిక ఉద్యోగి డెస్కులో ఉంచి పేల్చివేసినట్లు తాలిబన్ సెక్యూరిటీ కమాండర్ అబ్దుల్ ముబిన్ సఫీతెలిపినట్లు ఖామా ప్రెస్ నివేదించింది.

విమానాశ్ర‌యం స‌మీపంలో ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు భారీ పేలుడు శ‌బ్ధం వినిపించింద‌ని స్ధానికులు తెలిపారు. విమానాశ్ర‌య ప్రాంతాన్ని భ‌ద్ర‌తా ద‌ళాలు సీజ్ చేసి ఆ ప్రాంతానికి చేరుకునే రోడ్ల‌ను మూసివేశాయి. కాగా కాబూల్‌లో చైనీయులు ఎక్కువ‌గా బ‌స‌చేసే హోటల్‌పై డిసెంబ‌ర్ 12న సాయుధ దుండ‌గులు దాడి చేయ‌డం క‌ల‌కలం రేపిన సంగతి తెలిసిందే. కాబూల్ స‌హా ఆప్ఘ‌నిస్ధాన్‌లో ఇటీవ‌ల ఐఎస్ స్ధానిక గ్రూప్ స‌భ్యులు పెద్ద ఎత్త‌న బాంబు పేలుళ్లు, దాడుల‌కు తెగ‌బ‌డుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంద