తెలంగాణలో అన్ని ఎస్సీ నియోజకవర్గాలను గెలుస్తాం

ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో, అలాగే మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా బీజేపీ యోజన చేస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య తెలిపారు.
 
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొంటూ  తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఎస్సీ నియోజకవర్గాల పైన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్న విషయాన్ని కార్యకర్తలకు గుర్తు చేశారు.
కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు అందరూ నిరంతరం కష్టపడి, పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా ఎస్సీలకు నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలకు, ప్రజలకు చేరవేసే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని కార్యకర్తలకు ఆయన మార్గ నిర్దేశం చేశారు.
 
రాబోయే రోజులలో రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ ముఖ్య నాయకులంతా నిత్యం ప్రజా సేవలో ఉంటూ, ప్రజల సమస్యల పై కార్యక్రమాలు యోజన చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.
 
రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ ఎస్సీ మోర్ఛ ప్రధాన కార్యదర్శి శంభూనాథ్ తుండియా కూడా పాల్గొన్నారు.