8 బిలియన్ డాలర్లకు భారత, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం

భారత దేశం, ఇజ్రాయెల్ మధ్య దైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందని, ఈ సంఖ్యలో రక్షణ పరికరాలు లేవని భారత దేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 30 సంవత్సరాలు అయ్యిందని, రెండు దేశాల మధ్య 200 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
 “మేము 30 సంవత్సరాల క్రితం పూర్తి దౌత్య సంబంధాలను ప్రారంభించినప్పుడు, మా మధ్య 200 మిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది. ఇప్పుడు మా మధ్య వాణిజ్యం 8 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. ఇది రక్షణ రంగానికి సంబంధించిన అంకెలు లేకుండా. మా మధ్య వాణిజ్యం బాగానే కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.
భారత దేశంలో తమ పెట్టుబడుల గురించి గిలోన్ వివరిస్తూ, దాదాపు 300 ఇజ్రాయెల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయిని, పూణేలో ఆమ్‌డాక్స్ ఇజ్రాయెలీ కంపెనీ ఉందని, అందులో 14000 మంది భారతీయ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారని తెలిపారు.
“భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టిఎ)ను ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడారు. కానీ దురదృష్టం కొద్దీ మేము ఇతర దేశాలతో ఎఫ్‌టిఎ సహా సమాంతరంగా పనులు చేస్తున్నందున దానిని పక్కన పెట్టాం. అది త్వరలో తిరిగా గాడీలోకి వస్తుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
తాము త్వరలోనే ఎఫ్‌టిఎను ఖరారు చేయగలమని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ విశ్వాసం వ్యక్తం చేశారు.  రక్షణ, భద్రత రంగంలో భారత్, ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ పరికరాలు కొంటున్న దేశం. ఇజ్రాయెల్ ఎగుమతి చేస్తున్న మొత్తం ఆయుధాల్లో భారత్ వాటా 46 శాతంగా ఉంది.
 
భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా, మంచి నిబంధనలతో ఉన్నాయి. జూలై 2018లో, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ఆ దేశంలో భారత ప్రభుత్వాధినేత జరిపిన మొదటి పర్యటన ఇది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మోషే హోల్జ్‌బర్గ్‌తో సమావేశమయ్యారు. జనవరి 2019లో, అప్పటి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హోల్జ్‌బర్గ్, శామ్యూల్‌తో కలిసి ముంబై పర్యటనలో పాల్గొన్నారు.
రష్యా తర్వాత భారత్‌కు ఎక్కువ మిలిటరీ పరికరాలు అమ్ముతున్న రెండో అతిపెద్ద దేశం ఇజ్రాయెల్. వ్యవసాయం, నీటి నిర్వహణ విషయలో కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ‘మషావ్’తో భారత అధికారులు భాగస్వాములయ్యారని ‘ద జెరూసలెం పోస్ట్’ పేర్కొంది.