ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్‌

బాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌  తన హక్కులను కాపాడాలంటూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాణిజ్య పరమైన ప్రకటనల్లో తన పేరును, స్వరాన్ని, ఫొటోలను తన అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటర్ స్కామ్, మరే ఇతర సంస్థ, వ్యక్తులు వాడుకోకుండా నిరోధించాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని పిటిషన్ లో అమితాబ్ కోరారు. 
 
తన అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటర్ స్కామ్ నడుస్తున్నట్లు తెలిసిందని, తన ప్రచార హక్కులను కాపాడాలని పిటిషన్ లో అమితాబ్ కోరారు.అమితాబ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తన వాదన వినిపించారు. కేబీసీ లాటరీ లక్కీ డ్రా, కేబీసీ లాటరీ రిజిస్ట్రేషన్, అమితాబచ్చన్ వీడియో కాల్ లాంటి రూపాల్లో ఉన్న డాటాను కోర్టుకు సమర్పించి దావా వేశారు.
 
దీన్ని విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా.. అమితాబ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. అమితాబ్ అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని జస్టిస్ చావ్లా పరిగణనలోకి తీసుకున్నారు. 
 
ఈ కేసులో అమితాబ్ చెబుతున్నట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. దీంతో కొన్ని సంస్థలు తమ తమ ఉత్త్పత్తుల ప్రచారం కోసం సెలబ్రిటీ హోదా ఉన్న అమితాబ్ ఫొటోస్, వాయిస్ అనుమతి లేకుండానే వాడుతున్నారని భావించి ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇలాంటివి నిరోదించకపోతే అమితాబ్‌కి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆయన అనుమతి లేనిదే ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు అని న్యాయస్థానం పేర్కొంది.