దేశానికి స్థిరమైన పరిపాలన నమూనాను అందించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి “సుస్థిరమైన” పాలన నమూనాను అందించారని, ఇది ప్రతి సంవత్సరం డివిడెండ్లు పెరుగుతున్న కొద్దీ రాబడుల తగ్గుదల సూత్రాన్ని ధిక్కరించిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ఢిల్లీలో న్యూస్-ఎక్స్ టీవీ ఛానల్ ‘క్యాపిటల్ డైలాగ్’ కార్యక్రమంలో పాల్గొంటూ గత 20 సంవత్సరాలుగా, ప్రతి కొత్త సవాలుతో మోడీ పాలనా నమూనా మరింత బలపడిందని పేర్కన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే భుజ్ లో సంభవించిన వినాశకరమైన భూకంపాన్ని అధిగమించి, కొత్తగా నిర్మించడం ఆయన మొదటి సవాలు అని, ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 140 కోట్ల మంది జనాభాపై విరుచుకుపడిన కరోనామహమ్మారిన ఆయన ఎదుర్కొన్న తాజా సవాలు అని జితేంద్ర సింగ్ తెలిపానారు.

ఈ ప్రతీ సవాల్ ను కొత్త ఆలోచనలతో అధిగమించారని, కొత్త ఆలోచనలను ఎలా ఆవిష్కరించాలనే దాని గురించి చాలా గంటల ఆత్మపరిశీలన, ఆయనకు గల క్షేత్ర స్థాయి అనుభవం సవాళ్లను అవకాశంగా మార్చుకోవడానికి దోహద పడ్డాయని మంత్రి చెప్పారు.

2014 మేలో మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన మొదటి మంత్రం “గరిష్ట పాలన, కనీస ప్రభుత్వం” అని, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, ఇది పథకాలు, ఆలోచనలను ఏకీకృతం చేయడం ద్వారా “మొత్తం ప్రభుత్వం” విధానంగా మారిందని అని జితేంద్ర సింగ్ చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం, పౌర కేంద్రిత మోదీ పాలన నమూనాకు ఒక గీటు రాయిగా మారాయని తెలిపారు.

కేంద్రంలో బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే స్వీయ ధృవీకరణను ప్రవేశపెట్టడం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన పత్రాలను పొందే విధానాన్ని తొలగించడం, తద్వారా 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 70 శాతం మంది ఉన్న భారత యువత లో విశ్వాసం ఉంచడం ప్రధాన మంత్రి తొలి నిర్ణయాలలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, 2015 ఆగస్టు 15న ఎర్రకోట నుండి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నరేంద్ర మోదీ సూచించారని, దీనిని 1 జనవరి 2016 నుండి డిఒపిటి అమలు చేసిందని, ఇది అభ్యర్థులందరికీ సమాన అవకాశాలను సుగమం చేసిందని వివరించారు.  ఈ ప్రభుత్వం 1500 కి పైగా కాలం చెల్లిన,  పాలనకు ఆటంకంగా మారిన నిబంధనలను తొలగించిందని చెబుతూ సంస్కరణలన్నీ పాలనా సంస్కరణలు మాత్రమే కాదని, అవి సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే భారీ సాంఘిక సంస్కరణలు కూడానని మంత్రి చెప్పారు.

2018లో 30 సంవత్సరాల తరువాత మోదీ ప్రభుత్వం సవరించిన భారతదేశ అవినీతి నిరోధక చట్టం, 1988 గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు, లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇచ్చే చర్యను నేరపూరితం చేయడం, అదే సమయంలో వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు ఇటువంటి చర్యలకు సమర్థవంతమైన నిరోధాన్ని అమలు చేయడం వంటి అనేక కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఉచిత, అపరిమితమైన సమాచార ప్రాప్యత అవినీతికి విరుగుడు అని, ప్రజాసేవ అందించడంలో అవినీతిని నిర్మూలించడంలో సాంకేతిక పరిజ్ఞానం, ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించడం శక్తివంతమైన సాధనాలుగా రుజువైందని ఆయన స్పష్టం చేశారు.

విడాకులకు గురైన కుమార్తెలు, దివ్యాంగులకు కుటుంబ పెన్షన్ సదుపాయాన్ని సడలించడం, వృద్ధ పెన్షనర్ల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో సౌలభ్యం కోసం మొబైల్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, మరణించిన ప్రభుత్వ ఉద్యోగి/ పెన్షనర్ ల దివ్యాంగ పిల్లలకు కుటుంబ పెన్షన్ పొడిగింపు లేదా కుటుంబం పెన్షన్ లో పెద్ద పెంపు వంటి చర్యలతో సహా గత ఎనిమిదేళ్లలో అనేక విప్లవాత్మక పెన్షన్ సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

మరణించిన ప్రభుత్వోద్యోగి/పెన్షనర్ ల దివ్యాంగ పిల్లలకు పెన్షన్ జీతభత్యాలు పెంపు పెన్షన్ సంస్కరణలు మాత్రమే కాదని, ఇవి విస్తృతమైన సామాజిక-ఆర్థిక ప్రభావాలను కలిగి ఉన్న సాంఘిక సంస్కరణలు అని మంత్రి పేర్కొన్నారు.  డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ ను కూడా నిర్వహిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ కు విస్తృత శ్రేణి సమస్యలపై ప్రేక్షకుల నుండి అనేక ప్రశ్నలు వచ్చాయి. భారతదేశంలో అంతరిక్ష రంగం రహస్య ముసుగులో పనిచేస్తోందని, ఇక్కడ కూడా మోదీ రెండు సంవత్సరాల క్రితం ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఈ రంగాన్ని అన్ లాక్ చేశారని, ఫలితాలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.

ఎందుకంటే అంతరిక్ష సంస్కరణలు స్టార్టప్ ల సృజనాత్మక సామర్థ్యాలను ఆవిష్కరించాయని,  ఈ రోజు మనకు అంతరిక్ష శకలాల నిర్వహణ, నానో-శాటిలైట్, లాంచ్ వెహికల్, గ్రౌండ్ సిస్టమ్స్, రీసెర్చ్ మొదలైన అత్యాధునిక ప్రాంతాల్లో పనిచేస్తున్న 102 స్టార్టప్ లు ఉన్నాయని తెలిపారు. ఆర్ అండ్ డి, అకాడెమియా, పరిశ్రమలను సమాన వాటాతో విలీనం చేయడం ద్వారా, ఇస్రో నేతృత్వంలోని అంతరిక్ష విప్లవంతో పాటు ప్రైవేట్ రంగం, స్టార్టప్ లు కూడా సమాంతర స్థాయిలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్ప గలమని మంత్రి వివరించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎనిమిదేళ్ల ప్రభుత్వ పాలనలో, అన్వేషణ కోసం ఎదురుచూస్తున్న భారతదేశంలోని యువత ప్రతిభకు, వారి సామర్థ్యానికి పూర్తి స్థాయి ఆటను అందించడానికి కొత్త అవుట్‌లెట్‌లు లభించాయని మంత్రి చెప్పారు. భారతదేశం ఎల్లప్పుడూ భారీ టాలెంట్ పూల్, పెద్ద కలలు కనే అభిరుచిని కలిగి ఉందని, కానీ చివరకు మోదీ  వారికి ఖచ్చితమైన అవుట్ లెట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. రైల్వేలు, హైవేలు, వ్యవసాయం, వాటర్ మ్యాపింగ్, స్మార్ట్ సిటీస్, టెలిమెడిసిన్,  రోబోటిక్ సర్జరీ వంటి వివిధ రంగాలకు స్పేస్ టెక్నాలజీ అనువర్తనాలను ప్రస్తావిస్తూ, ‘‘ఇది సామాన్యులకు జీవన సౌలభ్యాన్ని’ తీసుకువచ్చింది.