
ఆయుధాలను సోషల్ మీడియా వేదికలపై సహా బహిరంగంగా ప్రదర్శించడంపై నిషేధం విధించారు. గన్ వయలెన్స్ పెచ్చుమీరిందని విపక్ష పార్టీల నుంచి ఆప్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
భగవంత్ మాన్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే వీఐపీలకు భద్రత తొలగించి కలకలం రేపింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, సింగర్ సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్స్టర్లు ఎందరో ఈ ఘటనకు లింక్ అయి ఉండటంతో ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించింది.
కొందరు గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చి చంపింది. ప్రముఖులకు భద్రత తొలగిస్తూ మాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, అమృత్సర్లో శివసేన నేత సుధీర్ సూరిని సాయుధ దుండగులు ఇటీవల పట్టపగలే కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఇక ఫరీద్కోట్లో డేరా బాబా అనుచురుడు ప్రదీప్ సింగ్ను కొందరు కాల్చిచంపారు.
అంతేకాదు పొరుగునే ఉన్న పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున తుపాకులను, అత్యంత అధునాతన ఆయుధాలను, డ్రగ్స్ను స్మగ్లర్లు పంజాబ్లోకి అక్రమంగా తరలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా కూడా పాకిస్థాన్ నుంచి పంజాబ్లోకి అక్రమంగా ఆయుధాలు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ఆప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి తోడు ఖలిస్థాన్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటుండటంతో మాన్ సర్కారు గన్ లైసన్స్లపై తాజా నిర్ణయాలు తీసుకుంది.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ