రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ20 భేటీకి హాజరుకావడం లేదు. ఇండోనేషియాలోని బాలిలో ఈ నెల 15-16 తేదీలలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకాకూడదని పుతిన్ నిర్ణయించినట్లు ఏఎఫ్పీ వార్తాసంస్థ కథనం. ఆయన స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను భేటీకి పంపుతున్నారు.
అయితే, ఈ సమావేశాలకు పుతిన్ వీడియో లింక్ ద్వారా పాల్గొననున్నారని ఇండోనేషియాలోని రష్యా రాయబార పుతిన్ను ఆహ్వానించొద్దని పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ తెచ్చిన ఒత్తిడిని ఇండోనేషియా బేఖాతరు చేసింది. అలా చేయలేనని స్పష్టంచేసింది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైన్యం వెనుకంజ వేస్తున్న తరుణంలో జీ20లో చేరేందుకు బాలి వెళ్లకూడదని పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.
పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వాటి నివారణకు రష్యా మార్గాలను వెతుకుతున్నది. వాస్తవానికి, భారతదేశం, అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల నాయకులు జీ20 సమావేశంలో పాల్గొంటారు. ఈ దేశాలు మొదటి నుంచి ఉక్రెయిన్తో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 9 నెలల తర్వాత కూడా యుద్ధం కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టేందుకు సరైన సమయం కానందున జీ20 సమావేశాలకు గైర్హాజరవడం ఒక్కటే మార్గమని రష్యా ఉన్నత వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
రష్యా విదేశాంగ మంత్రి జి20 సమావేశంలో పాల్గొంటారని, తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఒక సమావేశంలో ఆన్లైన్ ద్వారా చేరుతారని ఇండోనేషియా ప్రభుత్వం ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు తెలిపింది. ఇండోనేషియా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్సీని కూడా ఆహ్వానించింది. అయితే పుతిన్ సమావేశంలో పాల్గొంటే తాను పాల్గొనబోనని జెలెన్సీ స్పష్టంచేశారు.
More Stories
కల్నల్ వైభవ్ కాలే మృతికి క్షమాపణలు చెప్పిన ఐరాస
గాజాపై ఇజ్రాయెల్ దాడిలో భారతీయుడు మృతి
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు