భారత్ జోడో ట్విట్టర్ క్లోజ్ చేయాలన్న కోర్టు

కాపీరైట్ చట్టం ఉల్లంఘన కేసులో కాంగ్రెస్  అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో  భారత్ జోడో యాత్ర  కొనసాగుతున్నసమయంలో కాంగ్రెస్ పార్టీ  ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని సోమవారం ఓ బెంగుళూరు కోర్టు ఆదేశించింది. రాహుల్ యాత్ర సందర్భంగా తమ అనుమతి లేకుండా  కేజీఎఫ్-2 సినిమా పాటను వాడారనే ఆరోపణలు కోర్టు ముందుకు వచ్చాయి. 
 
ఈ విషయమై  ఒక సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేసింది. కాగా, దీనిపై ఎం ఆర్ టి  సంస్థ నిర్వాహకుడు నవీన్ కుమార్ భారత జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ  కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టుకు వెళ్లారు. సూపర్‌హిట్ కన్నడ చిత్రం కెజిఎఫ్ -2 నుండి ఓ పాటను కాపీకొట్టారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు.
 పొరుగున ఉన్న తెలంగాణకు వెళ్లడానికి ముందు కర్నాటకలో భారత్ జోడో యాత్రలో ఈ పాటను ప్లే చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది. బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో పోలీసులకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్‌ఐఆర్ దాఖలు అయ్యింది.
కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అనుమతి లేకుండా కెజిఎఫ్ -2 నుండి ఫేమస్ సాంగ్ని ఉపయోగించిన రెండు వీడియోలను ట్వీట్ చేశారని మ్యూజిక్ కంపెనీ పేర్కొంది. భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యాత్ర ముగించుకుని మహారాష్ట్రకు చేరుకుంది.