![](https://nijamtoday.com/wp-content/uploads/2022/11/Papikondalu.jpg)
వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఆదివారం తిరిగి పునఃప్రారంభమైంది. అధికారులు అనుమతి ఇచ్చారని ఏపీ టూరిజం టోటింగ్ అసిస్టెంట్ మేనేజర్ గంగబాబు తెలిపారు. గండి పోశమ్మ ఆలయం వద్ద ఉన్న రెండు పర్యాటక బోట్లలో 106 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు.
గోదావరి నదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండల విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి కలుగుతుంది. గోదావరికి వరదలు తగ్గడంతో పాపికొండల విహార యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుమతిచ్చింది.
గోదావరి నదిలో నీటి మట్టం తగ్గడంతో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో యాత్రను ఆపేశారు. అయితే, పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో వేసవిలోనూ కొనసాగించాలని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు నిర్ణయించారు.
గోదావరి నదిలో నీటి మట్టం తగ్గడంతో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో యాత్రను ఆపేశారు. అయితే, పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో వేసవిలోనూ కొనసాగించాలని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు నిర్ణయించారు.
దాంతో ప్రకృతి అందాల మధ్య గోదావరి నదిపై పడవ ప్రయాణం మళ్లీ మొదలు కాబోతోంది. గోదావరికి వరదలు తగ్గడంతో గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం తిరిగి ప్రారంభమైనది. ఇటీవలి వరదలకు సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్ర ఆగిపోయింది.
ప్రస్తుతం నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్రను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.గండి పోశమ్మ ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటు చేశారు. పోచమ్మ గండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
ఏపీలో హత్యకు గురైన వారి పేర్లు చెప్పమని చంద్రబాబు సవాల్!
వైసిపి ఆర్ధిక దోపిడీతో ఏపీకి రూ. 76,795 కోట్ల నష్టం
కాంట్రాక్టర్లను మార్చడంతోనే పోలవరం పనుల్లో జాప్యం