హర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి భజన లాల్ మనవుడు భవ్య బిష్ణోయ్ ఘన విజయం సాధించారు. ఆయనకు 16 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఆయన వయసు 29 సంవత్సరాలు.
భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్పై ఘన విజయం సాధించారు.భజన్ లాల్ కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కుల్దీప్ కుమారుడే భవ్య బిష్ణోయ్.
ఒడిశాలోని ధామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ బీజేడీ అభ్యర్తి అబంతి దాస్ పై 9,881 ఓట్ల తేడాతో గెలుపొందారు.
బీహార్ లో బీజేపీ, ఆర్జేడీలకు చెరొక సీటు గెలుపు
బిహార్లోని గోపాల్ గంజ్, మొకామశాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ, ఆర్జెడి చెరొక సీటు గెలుచుకున్నాయి. గోపాల్ గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించగా, మొకామాలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి గెలిచారు. జేడీయూ-బీజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు కనిపించాయి.
బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేసి, విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై కుసుమ్ దేవి సుమారు 1,800 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనం దేవిపై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
అనంత్ కుమార్ సింగ్ నివాసం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఆయనపై నమోదైన కేసులో ఆయన దోషి అని పాట్నా కోర్టు తీర్పు చెప్పింది. అనంతరం ఎన్నికల కమిషన్ ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగడంపైనా, ఎన్నికల్లో పోటీ చేయడంపైనా అనర్హత వేటు వేసింది.
More Stories
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు
ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే ప్రభుత్వం కోరుకొంటున్న టిఎంసి