ఉక్రెయిన్ మిలిటరీ దాడిలో వెయ్యి మంది రష్యా సైనికులు మరణించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత రష్యా మరోసారి ఇంత పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది. సైన్యంలోకి కొత్తగా రిక్రూట్ చేసుకున్న సైనికులను సరిహద్దుల వద్దకు రష్యా తరలించింది. అయితే కనీస ఆయుధాలు కూడా లేని రష్యా సైనికులపై ఉక్రెయిన్ దళాలు దాడి చేశాయి.
దీంతో గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్పై దాడులను తీవ్రం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి గోధుమల రవాణా కోసం ఐక్యరాజ్య సమితి (ఐరాస)తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా బ్రేక్ చేసింది.
ప్రపంచ మార్కెట్లకు ధాన్యాలు రవాణా చేయడం కోసం నల్లసముద్రంలోని షిప్పింగ్ కారిడార్ను ఉక్రెయిన్ వినియోగించుకుంటోందని, ఈ విధంగా తమ నౌకలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలకు, విద్రోహచర్యలకు ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి లోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఆరోపించారు. ఆ విధంగా ఉక్రెయిన్ తన కార్యకలాపాలు కొనసాగిస్తే ఉక్రెయిన్ ధాన్యాల రవాణా నౌకలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.
నల్లసముద్రం ప్రస్తుతం శత్రుత్వస్థావరంగా మారిందని, ఈ పరిస్థితుల దృష్టా తమ తనిఖీ లేనిదే ఆ మార్గం ద్వారా ఎలాంటి నౌకలను ఇకపై అనుమతించబోమని హెచ్చరించారు. ఇలాంటి నౌకల రవాణాను నియంత్రించడానికి రష్యా తన స్వయం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. గోధుమలు ఎగుమతి చేసే కారిడార్ను రష్యాపై దాడుల కోసం ఉక్రెయిన్ వినియోగిస్తున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యూఎన్, టర్కీతో చేసుకున్న ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు.
More Stories
లాస్ ఏంజెల్స్ కారుచిచ్చుతో 2025 ఆస్కార్ అవార్డులు రద్దు!
కాల్పుల విరమణకు ఇజ్రాయిల్- హమాస్ అంగీకారం
ఇండోనేసియాలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం