భారతదేశంలో తయారీ యూనిట్లకై అమెరికా కంపెనీలను ఆహ్వానం 

భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించాలని, ఎటువంటి హాని, అనిశ్చితి లేకుండా ప్రపంచ సరఫరా వ్యవస్థను సృష్టించడానికి భారతీయ పరిశ్రమల తో సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ అమెరికా కంపెనీలను ఆహ్వానించారు.  

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో జరిగిన 12వ డిఫెక్స్‌పో లో భాగంగా ఆమెరికా-భారత్ వాణిజ్య మండలి (యు.ఐ.బి.సి), భారత రక్షణ ఉత్పత్తిదారుల సంఘం (ఎస్.ఐ.డి.ఎం) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 

‘న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ యుఎస్-ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్: నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ & మేక్ ఇన్ ఇండియా’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ప్రగతిశీల సంస్కరణల ద్వారా భారత రక్షణ పరిశ్రమ గత ఎనిమిదేళ్లుగా పరివర్తనాత్మక మార్పులను సాధిస్తోందని  రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ సంస్కరణలు పారదర్శకత, ఊహాజనిత, వ్యాపార సౌలభ్యం కోసం అనేక చర్యలను సంస్థాగతీకరించడం ద్వారా భారతీయ పరిశ్రమ వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని ఆయన తెలిపారు.

‘ఆత్మనిర్భర్ భారత్’ కు మార్గం అనేది ఒక సమగ్రమైన విధానాన్ని చూపింది. ఇది స్వదేశీ సాంకేతిక, ఉత్పత్తి, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, ప్రఖ్యాత సంస్థలతో పాటు అసలు సామాగ్రి తయారీదారుల (ఓ.ఈ.ఎం.ల)తో స్నేహపూర్వకంగా సహకరించడం, భాగస్వామ్య సహకారంతో రూపొందించడానికి ప్రయత్నిస్తుందని కూడా  రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 

భారత మార్కెట్‌ కోసం భారత్‌ లో ఉత్పత్తి చేయడంతోపాటు స్నేహపూర్వక దేశాలకు ఎగుమతి చేయాలనే ఆలోచన ఉందని, అంటే ‘భారతదేశంలొ తయారీ, ప్రపంచం కోసం తయారీ’ అని ఆయన పేర్కొన్నారు. 

“భారత సాయుధ దళాల అవసరాలను తీర్చడం ప్రధాన లక్ష్యం; అదే సమయంలో, ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి విదేశీ ఓ.ఈ.ఎం.ల ప్రపంచ సరఫరా వ్యవస్థ దీర్ఘకాలిక అనుసంధానాలను సృష్టించాలి.  ఈ అనుసంధానాల ద్వారా, మన దేశంతో పాటు అమెరికా తో సహా మన భాగస్వాములకు రక్షణ పరికరాలు, ఇతర వ్యూహాత్మక సామగ్రికి నిరంతరాయంగా, విశ్వసనీయమైన ప్రాప్యతను నిర్ధారించడానికి స్వేచ్ఛా ప్రపంచానికి సురక్షితమైన, స్థితిస్థాపకమైన ప్రపంచ సరఫరా వ్యవస్థ కోసం సహకరించడానికి భారతదేశం ఎదురుచూస్తోంది” అని చెప్పారు.  

భారతదేశ రక్షణ స్థావరం పెరుగుతున్న కొద్దీ, అమెరికా నుంచి ప్రైవేట్ రంగ కంపెనీలు ‘భారతదేశంలో సృష్టించడం’, ‘భారతదేశం నుండి ఎగుమతి’ కోసం విస్తృత సామర్థ్యాన్ని అన్వేషించగలం అని రాజ్‌నాథ్ సింగ్  చెప్పారు. 

ఎఫ్‌.డి.ఐ. నిబంధనలను సడలించడం, డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 లో కొనుగోలు (భారతదేశంలో అంతర్జాతీయ-తయారీదారులు) ప్రవేశపెట్టడం, భారత రక్షణ పరిశ్రమ అందించే అవకాశాల్లో పాల్గొనడానికి అమెరికా వ్యాపారాలకు ఆహ్వానం అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

 ‘భారతదేశంలో తయారీ’ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంయుక్త కంపెనీలు ఇప్పుడు జాయింట్ వెంచర్ లేదా టెక్నాలజీ ఒప్పందం మొదలైన వాటి ద్వారా వ్యక్తిగతంగా లేదా భారతీయ కంపెనీల తో భాగస్వామ్యంతో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.  రక్షణ తయారీకి భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా కంపెనీలు కనుగొంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత్-అమెరికా రక్షణ సాంకేతిక, వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో ఎయిర్-లాంచ్డ్ యు.ఎ.వి.లను సహ-అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ ఒప్పందాన్ని రక్షణ మంత్రి అభివర్ణించారు.  మానవరహిత వైమానిక వ్యవస్థలు, ఇంటెలిజెన్స్, నిఘా, లక్ష్య సముపార్జన, నిఘా వేదిక వంటి అదనపు డి.టి.టి.ఐ. ప్రాజెక్టులను రెండు వైపుల నుంచి పరిశ్రమలు అన్వేషించవచ్చు నని ఆయన పేర్కొన్నారు.