టూరిజం వాహనాల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని కోరారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని, ముఖ్యమంత్రులు, రవాణా శాఖ మంత్రులతో చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పానారు. అందరం కలిసి పని చేస్తూ టూరిజం రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేలా చేయాలని అభ్యర్థించారు. ప్రసాద్, స్వదేశీ దర్శన్ పథకాల్లోనూ పరస్పర సహకారం ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు
పేపర్లు, టీవీల ద్వారా మీడియాను భాగస్వామ్యం చేస్తూ దేఖో అప్నా స్టేట్ అంటూ టూరిస్ట్ ప్రాంతాలను ప్రమోట్ చేయాలని చెప్పారు. తాను వెళ్లిన చాలా పర్యాటక ప్రాంతాల్లో నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, స్వచ్ఛత-పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు.
రాబోయే రోజుల్లో 500 పర్యాటక ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెబుతూ జాతీయ జెండాతో ఆ స్థలానికి గుర్తింపు మరింత పెరుగుతుందని తెలిపారు. హోటల్స్ ఎంట్రన్స్ వద్ద త్రివర్ణ పతాకంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను ఏర్పాటు చేయాలని కోరారు.
భారత్ ప్రతిష్టను పెంచేలా అత్యుత్తమ వెబ్ సైట్ రూపొందించాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష అన్న కిషన్ రెడ్డి, రాష్ట్రాల నుంచి వివిధ పండుగలు, టూరిస్ట్ గమ్య స్థానాలకు సంబంధించిన ఫొటోలు, సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలు సహాయ సహకారాలు అందిస్తేనే వెబ్ సైట్ తయారవుతుందని చెప్పారు.
జవాబుదారీతనం ఉన్న ప్రొఫెషనల్ సోషల్ మీడియా టీములను ఏర్పాటు చేసుకుని ప్రమోషన్ చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ సదస్సులో సహాయ మంత్రి అజయ్ భట్, వివిధ రాష్ట్రాల మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు సీఈవో అమితాబ్ కాంత్, టూరిజం డైరెక్టర్ జనరల్ కమలవర్ధన్ రావు, తెలంగాణ టూరిజం బోర్డ్ ఎండీ మనోహర్ రావు, కార్యదర్శులు, అధికారులు, పలు కంపెనీల వాటాదారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ పాత్ర, వైద్య, అటవీ, వైల్డ్ లైఫ్, అగ్రి, సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటక రంగాభివృద్ధిపై మేథోమధనం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న పర్యాటకాభివృద్ధిపై వీడియోలు ప్రదర్శించారు.
More Stories
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?