రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన చేతిలో పట్టుకునే పరికరం (హెచ్హెచ్టి)ల ద్వారా చివరి నిమిషంలో సైతం ఖాళీగా ఉన్న బెర్త్, లేదా సీటును కేటాయించడానికి వీలవుతోంది. నాలుగు నెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ పరికరం ద్వారా ప్రతి రోజూ రైళ్లలో సగటున దాదాపు 7,000 మంది కన్ఫర్మ్ కాని టికెట్ హోల్డర్లు బెర్త్లు, సీట్లు పొందగలుగుతున్నారు.
ఒక ఐపాడ్ సైజులో ఉండే ఈ హెచ్హెచ్టిలో రైళ్లకు సంబంధించిన ప్రయాణికుల రిజర్వేషన్ చార్టులు అంతకు ముందే లోడయి ఉంటాయి. గతంలో మాదిరి పేపర్ రిజర్వేషన్ చార్టులను చెక్ చేయడానికి బదులు టిటిఇలు ఈ పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు బుకింగ్స్ పరిస్థితిని తెలుసుకోగలుగుతారు. ఈ పరికరాలు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సెంట్రల్ సర్వర్కు కనెక్ట్ అయి ఉంటాయి.
ఒక వేళ రిజర్వ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికుడెవరైనా రాకపోయినా, చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నా ఖాళీ అయిన బెర్త్ ఈ పరికరంలో డిస్ప్లే అవుతంది. దీనివల్ల టిటిఇ ఆ సీటును రైల్లో ఉన్న వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుడికో లేదా ఆర్ఎసిలో ఉన్న ప్రయాణికుడికో కేటాయించడానికి వీలవుతుంది.
దీనివల్ల నడిచే రైళ్లలో బెర్త్ల కేటాయింపులో పారదర్శకత కూడా ఉంటుంది. పిటిఐ సంపాదించిన డేటా ప్రకారం నాలుగు నెలల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కింద దాదాపు 1,390 రైళ్లలోని టిటిఇలు ప్రతి రోజూ దాదాపు 10,745 హెచ్హెచ్టిలు తీసుకెళుతున్నారు. గత నాలుగు నెలల్లో సగటున ప్రతి రోజూ 5,448 మంది ఆర్ఎసి ప్రయాణికులు, 2,759 మంది వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులకు స్పష్టమైన బెర్త్లను కేటాయించ గలిగారు.
రాబోయే మూడు నెలల్లో అన్ని దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని టిటిఇలకు ఈ పరికరాలను ఇవ్నున్నారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా ప్రయాణికులనుంచి అధిక టికెట్ చార్జీలు, పెనాల్టీలు, ఇతర చార్జీలను కూడా వీటి ద్వారా టిటిఇలు వసూలు చేయవచ్చు. రాబోయే రోజుల్లో ఇందుకు రసీదులు జారీ చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు.
More Stories
అస్సాంలో ఎఎఫ్ఎస్పిఎ మరో ఆరు నెలలు పొడిగింపు
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు